పెంగ్విన్ తర్వాత కీర్తికి బంపర్ ఆఫర్లు.. కమల్ సరసన మహానటి?

Webdunia
బుధవారం, 22 జులై 2020 (19:47 IST)
పెంగ్విన్ సినిమా తర్వాత మహానటి ఫేమ్ కీర్తి సురేష్‌‌కు ఆఫర్లు వెల్లువల్లా వస్తున్నాయి. ఇప్పటికే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన సర్కారు వారి పాట సినిమాలో హీరోయిన్‌గా నటించే ఛాన్సు కొట్టేసిన కీర్తి సురేష్.. ప్రస్తుతం సినీ లెజెండ్ కమల్ హాసన్ సరసన నటించే అవకాశాన్ని కైవసం చేసుకుందని టాక్ వస్తోంది. అమేజాన్ ప్రైమ్ వీడియోలో మూడు భాషల్లో విడుదలైన కీర్తి సురేష్ చిత్రం పెంగ్విన్‌కు మంచి మార్కులే పడ్డాయి. ఈ చిత్రం ద్వారా కీర్తి సురేష్‌ నటనకు ప్రశంసలు అందాయి. 
 
ఈ నేపథ్యంలో కీర్తి సురేష్ కమల్ హాసన్‌తో కలిసి నటించనుందనే వార్తలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో కమల్ హీరోగా నటించి తెరకెక్కిన వేట్టైయాడు విలైయాడు (తెలుగులో రాఘవన్) సినిమాకు సీక్వెల్ రానుంది. ఇందులో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో కనిపించనుందని టాక్ వస్తోంది. 
 
అయితే ఈ వార్తల్లో నిజం లేదని కీర్తి సురేష్ సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. ఇదిలా ఉంటే.. కీర్తి సురేష్ ప్రస్తుతం మలయాళం, తెలుగు, తమిళ భాషలలో మరక్కర్: అరబికడలింటే సింహామ్, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి, రంగ్ దే, అన్నాతే చిత్రాల్లో నటిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీ అభివృద్ధికి డబుల్ ఇంజిన్ సర్కారు : ప్రధాని నరేంద్ర మోడీ

కర్ణాటక మంత్రులు వర్సెస్ నారా లోకేష్‌ల స్పైసీ వార్... రాయితీలిస్తే ఏపీకి పెట్టుబడులు రావా?

ప్రధాని మోడీ కర్మయోగి - కూటమి ప్రభుత్వం 15 యేళ్లు కొనసాగాలి : పవన్ కళ్యాణ్

PM tour in AP: ప్రధాని ఏపీ పర్యటనలో అపశృతి.. కరెంట్ షాకుతో ఒకరు మృతి (video)

మొన్న రోడ్లు.. నేడు చెత్త : కరిణ్ మజుందార్ షా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

తర్వాతి కథనం
Show comments