Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాధ్యతగల పౌరులుగా నిబంధనలు పాటిద్దాం : తొలి ట్వీట్‌లో చెర్రీ పిలుపు

Webdunia
గురువారం, 26 మార్చి 2020 (16:08 IST)
మహమ్మారి కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఈ దేశంలో బాధ్యతగల పౌరులుగా రూల్స్‌ను తు.చ తప్పకుండా పాటిద్దామని టాలీవుడ్ హీరో రామ్ చరణ్ పిలుపునిచ్చారు. ఆయన తన ట్విట్టర్ ఖాతాను గురువారం ప్రారంభించారు. ఇందులో తొలి పోస్టు చేస్తూ పైవిధంగా పిలుపునిచ్చారు. 
 
అలాగే, కరోనా బాధితుల సహాయార్థం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ ఇచ్చిన పిలుపుమేరకు తనవంతుగా ప్రధానమంత్రి సహాయనిధితో పాటు.. రెండు తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్‌లకు రూ.70 లక్షల విరాళాన్ని ప్రకటించారు. 
 
అలాగే దేశం నుంచి కరోనా వైరస్‌ను తరిమికొట్టేందుకు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డిలు ఎంతగానో కృషి చేస్తున్నారంటూ ప్రశంసించారు. అందువల్ల మనవంతుగా బాధ్యతగల పౌరులుగా నడుచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. 
 
కాగా, రామ్ చరణ్ తన ట్విట్టర్ ఖాతాను @AlwaysRamCharan పేరుతో ప్రారంభించారు. ఈ ఖాతాకు ఇప్పటికే ఐదువేల మంది నెటిజన్లు ఫాలోయర్లుగా ఉన్నారు. కాగా, ఈయన తండ్రి, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూడా తెలుగు కొత్త సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకుని బుధవారం ట్విట్టర్ ఖాతాను ప్రారంభించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హోటల్ గదిలో శృంగారంలో మునిగిన జంట: బ్రిడ్జి పైనుంచి వీడియో రికార్డింగ్, ట్రాఫిక్ జామ్

బనకచర్లపై సీఎం చంద్రబాబుతో చర్చించేందుకు సిద్ధం : సీఎం రేవంత్ రెడ్డి

కదులుతున్న రైలులో రక్తం వచ్చేట్లు కొట్టుకున్న యువతులు (video)

100 మంది పిల్లలకు జన్మనిచ్చానంటున్న టెలిగ్రామ్ సీఈవో!

'ఆపరేషన్ సింధు' కోసం గగనతలాన్ని తెరిచిన ఇరాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments