Webdunia - Bharat's app for daily news and videos

Install App

నయనతారకు గాయం.. పెయిన్ కిల్లర్స్‌తో షూటింగ్‌కు.. యూనిట్ ప్రశంస..

అగ్రహీరోయిన్‌ అయిన నయనతార తన వృత్తిపట్ల అంకిత భావాన్ని చాటుకుంది. ఇటీవల స్టేజీపై నుంచి కింద పడిపోవడంతో వెన్నుకు దెబ్బతగిలింది. దీంతో కొన్నివారాల పాటు నయనతార విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు ఆమెకు సూచించ

Webdunia
శనివారం, 15 ఏప్రియల్ 2017 (17:51 IST)
అగ్రహీరోయిన్‌ అయిన నయనతార తన వృత్తిపట్ల అంకిత భావాన్ని చాటుకుంది. ఇటీవల స్టేజీపై నుంచి కింద పడిపోవడంతో వెన్నుకు దెబ్బతగిలింది. దీంతో కొన్నివారాల పాటు నయనతార విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు ఆమెకు సూచించారు. కానీ తాను విశ్రాంతి తీసుకుంటే.. సినిమా షూటింగ్ ఆగిపోతుందని భావించిన నయనతార.. పెయిన్ కిల్లర్లను వేసుకుంటూ షూటింగ్‌కు హాజరవుతోంది. 
 
ప్రస్తుతం ''జయం'' మోహన్ దర్శకత్వంలో శివకార్తీకేయన్ సరసన నయనతార వేలైక్కారన్ చిత్రంలో నటిస్తోంది. ఈ షూటింగ్‌లోనే నయనతార కిందపడిపోయింది. ఈ ప్రమాదంలో అమ్మడుకు దెబ్బ తగిలినా లెక్కచేయకుండా విశ్రాంతి తీసుకోకుండా మందుల్ని మింగి షూటింగ్‌లో పాల్గొంటోంది. నయనకు వృత్తి పట్ల అంకితభావాన్ని యూనిట్ సభ్యులు కొనియాడుతున్నారు. 
 
కాగా... సినిమా ప్రమోషన్లకు నయనతార హాజరు కాదని ఇప్పటికే ఆమెపై పలు విమర్శలు వచ్చాయి. అయితే వృత్తి పట్ల తనకున్న అంకితభావాన్ని ప్రదర్శించిన నయనతారను చూసి విమర్శకులు సైతం నోటికి తాళం వేసుకుంటున్నారు. 

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రజల్ వీడియోలు : సస్పెండ్ చేసిన జేడీఎస్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ముఖ్యాంశాలు ఇవే..

బీజేపీ రాజ్యాంగ పుస్తకాన్ని విసిరివేయాలనుకుంటోంది.. రాహుల్ గాంధీ ఫైర్

విజయవాడలో దారుణం : ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు.. ఇంటి బయట మరో శవం..

కోకో చెట్లను తుడిచిపెట్టే వినాశకరమైన వైరస్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments