దర్శకుడిగా "గ్రహణం"తో కెరీర్ను ప్రారంభించినప్పటి నుంచి ఇంద్రగంటి తన సినిమాల్లో ఎక్కువ శాతం తెలుగు నటీనటులు, టెక్నీషియన్లు ఉండేలా జాగ్రత్తపడతారు. తెలుగువారంటే ఆయనకి ముందు నుంచీ ప్రత్యేకమైన అభిమానం.
దర్శకుడిగా "గ్రహణం"తో కెరీర్ను ప్రారంభించినప్పటి నుంచి ఇంద్రగంటి తన సినిమాల్లో ఎక్కువ శాతం తెలుగు నటీనటులు, టెక్నీషియన్లు ఉండేలా జాగ్రత్తపడతారు. తెలుగువారంటే ఆయనకి ముందు నుంచీ ప్రత్యేకమైన అభిమానం. ఆయన తెరకెక్కించిన "మాయాబజార్, ఆష్టాచెమ్మా, గోల్కొండ హైస్కూల్, అంతకుముందు ఆ తర్వాత, బందిపోటు, జెంటిల్మెన్" వంటి చిత్రాల్లో ఎక్కువ మంది తెలుగు ఆర్టిస్ట్స్, టెక్నీషియన్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకొనేవారు. ఇప్పుడు ఆయన తెరకెక్కిస్తున్న తాజా చిత్రం కోసం అందరూ తెలుగు వారే ఉండేలా ప్లాన్ చేసుకొన్నారు.
అవసరాల శ్రీనివాస్, అడివి శేష్ కథానాయకులుగా తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ చిత్రంలో మన తెలుగమ్మాయిలైన ఈష, అదితి మ్యానికల్లను కథానాయికలుగా ఎంపిక చేశారు. ఈ చిత్రానికి పని చేసే టెక్నీషియన్లు కూడా అందరూ తెలుగు వారినే తీసుకొన్నారు. అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫిబ్రవరి 1న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది.