Webdunia - Bharat's app for daily news and videos

Install App

'కూలీ' చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్‌కు షాకిచ్చిన ఇళయరాజా!

ఠాగూర్
గురువారం, 2 మే 2024 (14:00 IST)
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా మరోమారు షాకిచ్చారు. సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త చిత్రం 'కూలీ'ని నిర్మిస్తున్న సన్ పిక్చర్స్‌కు కాపీరైట్ నోటీసులు జారీ చేశారు. ఈ చిత్రం టీజర్‌లో తన సంగీతాన్ని నేపథ్యంగా వాడటాన్ని ఆయన ఖండిస్తూ, ఈ నోటీసులు జారీచేశారు. 'కూలీ' చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెల్సిందే. ఇది రజినీకాంత్ నటించే 171వ చిత్రం. ఈ చిత్రం టైటిల్‌తో పాటు టీజర్‌ను తాజా రిలీజ్ చేశారు. ఇందులో "వా వా పక్కం వా" అనే పాటలోని సంగీతాన్ని బ్యాక్‌గ్రౌండ్‌గా ఉపయోగించారు. 
 
తన అనుమతి లేకుండా ఉపయోగించిన ఆ పాట సంగీతాన్ని వెంటనే తొలగించాలని, లేనిపక్షంలో ఆ పాటకు తగిన అనుమతి పొందాలని సన్ పిక్చర్స్‌కు ఇళయరాజా కాపీరైట్ నోటీసులు పంపించారు. అలా చేయకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇత తన సంగీతంలోని పాటలను తన అనుమతి లేకుండా స్టేజ్ షోలలో కూడా ఆలపించరాదని, సినిమాల్లోనూ ఉపయోగించరాదని గతంలో ఇళయారాజా ఆంక్షలు విధించిన విషయం తెల్సిందే. దానిని అతిక్రమించిన వారిపై ఆయన కేసులు పెడుతున్నారు కూడా. ఆ కోవలోనే ఇపుడు సన్ పిక్చర్స్‌కు  ఇళయరాజా కాపీరైట్ నోటీసులు పంపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తాపీ మేస్త్రిగా మారిన రాహుల్ గాంధీ.. ఎక్కడ? (Video)

ఆరో తరగతి చదువుతున్న బాలికతో యువకుడి పెళ్లి..!!

గన్నవరంలోని గోడౌన్‌లో రూ.2.46 కోట్ల సిగరెట్లు స్వాధీనం

కుమారి ఆంటీ ఫుడ్‌స్టాల్ వద్ద బాలీవుడ్ నటుడు సోనూసూద్..(Video Viral)

పెద్దిరెడ్డి ఇలాకాలో జారుకుంటున్న వైకాపా నేతలు.. టీడీపీలో చేరేందుకు సిద్ధం!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments