Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగాస్టార్‌కు ప్రతిష్టాత్మక అవార్డు .. ఏంటది?

Webdunia
సోమవారం, 21 నవంబరు 2022 (08:23 IST)
మెగాస్టార్ చిరంజీవికి ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్‌ అవార్డు కోసం ఆయన్ను ఎంపిక చేశారు. దీన్ని కేంద్రం ప్రకటించింది. సోమవారం నుంచి గోవా వేదికగా జరిగే ఇఫీ (ఐఎఫ్ఎఫ్ఐ) చలనచిత్రోత్సవ వేడుకల్లో ఈ అవార్డును చిరంజీవికి ప్రదానం చేస్తారు. ఇలాంటి ప్రతిష్టాత్మక అవార్డుకు తనను ఎంపిక చేయడంపై చిరంజీవి స్పందించారు. 
 
కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ చేసిన ప్రకటన తనకెంతో సంతోషం కలిగించిందన్నారు. కేంద్ర ప్రభుత్వానికి, తాను ఈ స్థాయిలో ఉండటానికి కారణమైన అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అని చిరంజీవి అన్నారు. 
 
అంతకుముందు చిరంజీవిని ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022గా ప్రకటిస్తూ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ అధికారికంగా ఓ ట్వీట్ చేశారు. తెలుగు సినిమా రంగంలో చిరంజీవి విశేష ప్రజాదారణ పొందారని, హృదయాలను కలిగించే నటనా ప్రతిభ ఆయన సొంతమని కొనియాడుతూ, మెగాస్టార్‌కు ఆయన అభినందనలు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బైకును కారులా మార్చేశాడు.. ఆరుగురితో హ్యాపీగా జర్నీ చేశాడు.. (వీడియో)

సీతమ్మకు తాళికట్టిన వైకాపా ఎమ్మెల్యే.. అడ్డుకోని పండితులు...

జైపూరులో ఘోరం: బైకర్లపై దూసుకెళ్లని ఎస్‌యూవీ కారు.. నలుగురు మృతి

వాటర్ వరల్డ్‌లోపడిన ఆరేళ్ల బాలుడు... ఆస్పత్రికి తరలించేలోపు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments