Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రమాదం జరిగినపుడు రక్తం చుక్క కూడా రాలేదు : అల్లు అరవింద్

Webdunia
మంగళవారం, 11 ఏప్రియల్ 2023 (15:02 IST)
గతంలో హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైయ్యారు. ఆయన బైకుపై వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. దీనిపై టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ తాజాగా స్పందించారు. సాయి ధరమ్ తేజ్‌కి యాక్సిడెంట్ అయిందన్న వార్త తెలియగానే తాను హుటాహుటిన ప్రమాదం స్థలానికి చేరుకున్నాను. అపుడు సాయిని చూసి నాకు చాల భయం వేసింది. రక్తం చుక్క కూడా రాలేదు.. ఏం జరిగిందో తెలియడానికి పావుగంట పట్టింది. అంత పెద్ద ప్రమాదం నుంచి అతడు బయటపడినందుకు చాలా ఆనందంగా ఉంది. సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం "విరూపాక్ష". ఈ చిత్రం ఆడియో రిలీజ్ వేడుక జరిగింది. ఇందులో పాల్గొన్న అల్లు అరవింద్ ఈ ప్రమాదం గురించి మాట్లాడారు. 
 
ఇకపోతే, సాయిధరమ్‌ తేజ్‌ కూడా తనకు జరిగిన ప్రమాదంపై స్పందించారు. 'యాక్సిడెంట్‌ ప్రభావం సినిమాలపై పడుతుందని కొందరు అనుకున్నారు. అసలు ఆ యాక్సిడెంట్‌ సంగతే నేను మర్చిపోయాను. అది ఒక స్వీట్‌ మెమొరీ కింద లాక్‌ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు పూర్తిగా కోలుకున్నా. ఇకపై గ్యాప్ తీసుకోను.. వరసగా సినిమాలు చేస్తాను' అని ఈ యంగ్‌ హీరో చెప్పారు. కార్తీక్‌ దండు దర్శకత్వంలో తెరకెక్కిన 'విరూపాక్ష'లో సంయుక్త హీరోయిన్‌గా నటించగా, ఈ నెల 21వ తేదీన విడుదలకానుంది. 

సంబంధిత వార్తలు

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

సిగ్నల్ లైట్‌కు బురద పూసి రైలు దోపిడీకి యత్నం!!

సింగపూర్‌లో మళ్లీ కోవిడ్ విజృంభణ.. వారం రోజుల్లో 26 వేల మందికి...

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments