హీరో ప్రభాస్ అంటే ఎంతో ఇష్టమని.. ఆయన ఫ్యాన్గా మారిపోయానని.. నటి సురభి చెబుతోంది. 'బీరువా' చిత్రంతో సందీప్ కిషన్తో నటించిన ఆమె తాజాగా 'జంటిల్మెన్'లో నానితో నటించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... హిందీలో మాధురి దీక్షిత్ను స్పూర్తిగా తీసుకుని న
హీరో ప్రభాస్ అంటే ఎంతో ఇష్టమని.. ఆయన ఫ్యాన్గా మారిపోయానని.. నటి సురభి చెబుతోంది. 'బీరువా' చిత్రంతో సందీప్ కిషన్తో నటించిన ఆమె తాజాగా 'జంటిల్మెన్'లో నానితో నటించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... హిందీలో మాధురి దీక్షిత్ను స్పూర్తిగా తీసుకుని నటిగా మారానని చెప్పింది.
చిన్నతనంలోనే డాన్స్, నటన అంటే ఆసక్తి అని.. మహారాష్ట్రలో పుట్టినా ఢిల్లీలోనే పెరిగానని తెలిపింది. తెలుగులో యువహీరోలంతా బాగా డాన్స్ చేస్తారనీ.. వారితో కలిసి నటించే ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నానని చెప్పింది. అల్లు అర్జున్, ఎన్టిఆర్, మహేష్ బాబులతో చేయాలనుందని వెల్లడించింది. ఇక ప్రభాస్ అంటే.. జాతీయస్థాయిలో పేరుపొందాడు. బాహుబలిలో అద్భుతంగా నటించాడనీ.. అందుకే ఆయన ఫ్యాన్గా మారిపోయానని అంది.