Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీఎస్టీ కేసు: వర్మను అరెస్ట్ చేస్తారా? రెండేళ్ల నుంచి ఏడేళ్ల జైలుశిక్ష పడే ఛాన్స్?

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేయాలా? వద్దా? అనేది అతనిపైనే ఆధారపడి వుంటుందని సైబర్ క్రైమ్ డీసీపీ రఘువీర్ అన్నారు. ''జీఎస్టీ'' వెబ్ చిత్రం పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ సినిమాల

Webdunia
శనివారం, 17 ఫిబ్రవరి 2018 (16:42 IST)
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేయాలా? వద్దా? అనేది అతనిపైనే ఆధారపడి వుంటుందని సైబర్ క్రైమ్ డీసీపీ రఘువీర్ అన్నారు. ''జీఎస్టీ'' వెబ్ చిత్రం పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అశ్లీలతపై మహిళా సంఘాలు మండిపడ్డాయి. అలాగే ఈ సినిమాలో మహిళలను కించపరిచారంటూ హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు మహిళా సంఘాలు ఫిర్యాదు చేశాయి. ఈ కేసుపై విచారణ నిమిత్తం వర్మ సీసీఎస్ కార్యాలయానికి హాజరయ్యారు. ఆయనతో పాటు అడ్వొకేట్ కూడా వచ్చారు. 
 
విచారణలో వీరిద్దరే పాల్గొన్నారని సైబర్ క్రైమ్ డీసీపీ రఘువీర్ అన్నారు. వర్మ వద్ద పూర్తి స్థాయిలో విచారణ జరిపామని తెలిపారు. సామాన్య వ్యక్తిగానే వర్మను పరిగణిస్తామని చెప్పారు. చట్టం ముందు అందరూ సమానమేనని చెప్పుకొచ్చారు. జీఎస్టీ సినిమాకు సంబంధించి ఒక ఎఫ్ఐఆర్, మహిళలను కించపరిచేలా మాట్లాడారనే దానికి సంబంధించి మరొక ఎఫ్ఐఆర్ ఆయనపై నమోదయ్యాయని.. ఆర్జీవీ ఇచ్చే సమాధానాలను బట్టే ఆయనను అరెస్ట్ చేయాలా? వద్దా? అనేది నిర్ణయిస్తామని చెప్పారు. కోర్టులో ప్రవేశపెట్టేందుకు అవసరమైన ఆధారాలను సేకరించిన తర్వాతే అరెస్ట్ పై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
 
వర్మ కేసు సాధారణమైంది కాదని, ఒకవేళ వర్మ దోషిగా తేలితే.. రెండేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం వుందన్నారు. టెక్నికల్‌గా చాలా ఆధారాలను సేకరించాల్సి వుందన్నారు. జీఎస్టీలో అశ్లీలత, మహిళలపై అభ్యంతరకరమైన కామెంట్స్ సంబంధించి శనివారం వర్మ వద్ద విచారణ పూర్తయ్యింది. మూడున్నర గంటల సేపు ఈ విచారణ జరిగింది. ఈ సందర్భంగా వర్మను 25 ప్రశ్నలేశారని సమాచారం. విచారణ ముగిసిన వెంటనే మరో నోటీసును వర్మకు అందజేశారు. వచ్చే శుక్రవారం కూడా మళ్లీ విచారణకు హాజరు కావాలంటూ నోటీసులో పేర్కొన్నారు. మొబైల్ ఫోన్, ల్యాప్ టాప్‌ను పోలీసులు సీజ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ది గోల్కొండ బ్లూ- అరుదైన నీలి వజ్రం- మే 14న జెనీవాలో వేలానికి సిద్ధం (video)

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థిని పరిస్థితి విషమం

తిరుగుబాటు చట్టాలను అమలు చేయనున్న డోనాల్డ్ ట్రంప్ - 20న ఆదేశాలు జారీ!

అయ్యప్ప భక్తులకు శుభవార్త - ఇకపై బంగారు లాకెట్ల విక్రయం

వీరాభిమానికి స్వయంగా పాదరక్షలు తొడిగిన నరేంద్ర మోడీ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments