Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమిత్ షాతో ఎన్టీఆర్ భేటీ... బీజేపీ గాలం వేస్తుందా?

Webdunia
సోమవారం, 22 ఆగస్టు 2022 (16:41 IST)
బీజేపీ అగ్రనేత అమిత్ షాతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలవడం ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్ అంటేనే టీడీపీ అనేది టక్కున చెప్పేశారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ ఉన్నట్టుండి.. బీజేపీ అగ్రనేతను కలవడం చర్చనీయాంశమైంది. 
 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్‌ రాజకీయ యాత్ర కూడా చేశాడు. ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో ఆయన పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. అలాంటి ఎన్టీఆర్‌ తనకు తాను అమిత్‌ షాను కలవడం ఏంటి అనే మాట చర్చగా మారింది. ఆదివారం మొత్తం ఈ చర్చే నడిచింది. అయితే బీజేపీ నాయకత్వమే ఎన్టీఆర్‌ను పిలిచింది అనే టాక్‌ కూడా నడిచింది. 
 
అనుకున్నట్టుగా ఆదివారం రాత్రి 8 గంటలకు అమిత్ షాను ఎన్టీఆర్ కలుసుకున్నారు. హైదరాబాదులోని పెద్ద హోటల్‌లో వీరిద్దరి భేటీ జరిగింది. ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నారట. ఆ తర్వాత ఇద్దరూ కలసి భోజనం కూడా చేశారు. ఎందుకు కలిశారు, ఏం మాట్లాడారు అనే విషయంలో ఎక్కడా సమాచారం లేదు. 
 
అయితే 'ఆర్‌ఆర్‌ఆర్‌'లో ఎన్టీఆర్‌ నటనను చూసి మురిసిపోయిన అమిత్‌ షా పిలిపించి మాట్లాడారు అంటూ ఓ మాట వినిపిస్తోంది. ఆ విషయం పక్కనపెడితే.. త్వరలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్టీఆర్‌ వర్గానికి చెందిన వారిని తమ వైపు తిప్పుకునేందుకు అమిత్‌ షా కలిశారని చెప్తున్నారు. 
 
ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీతో కలవడానికి టీడీపీ ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఎన్టీఆర్‌ను అమిత్‌ షా కలవడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments