Chakri: సింగర్ జుబీన్ గార్గ్‌కు హీరోయిన్ భైరవి అర్ద్య డేకా ఘన నివాళి

చిత్రా సేన్
బుధవారం, 24 సెప్టెంబరు 2025 (17:39 IST)
Bhairavi Ardya Deka pays tribute to singer Zubeen Garg
సింగపూర్‌లో సెప్టెంబర్ 19న స్కూబా డైవింగ్ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన భారతీయ లెజెండరీ సింగర్ జుబీన్ గార్గ్ స్మారక సంతాప సభ హైదరాబాద్ గచ్చిబౌలిలో జరిగింది. ఈ సందర్భంగా హీరోయిన్ భైరవి అర్ద్య డేకా ఆయనకు ఘనంగా నివాళి అర్పించారు. స్కూబా డైవింగ్ చేస్తూ జుబీన్ గార్గ్ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మరణించారు. ఈ ఘటన భారతీయ చిత్ర పరిశ్రమను విషాదంలోకి నెట్టింది.
 
తెలుగులో కూడా ఆయన గుర్తుండిపోయే పాటలు పాడారు. హీరో నితిన్ నటించిన టక్కరి లోని ‘యేలే యేలే’, విక్టరీ సినిమాలోని ఓ బ్యాచిలర్, రామ్ పోతినేని మస్కా మూవీలోని  గుండె గోదారిలా వంటి పాటలను పాడి తెలుగు ప్రేక్షకులను అలరించారు. ఈ పాటలను పాడే అవకాశం దివంగత సంగీత దర్శకుడు చక్రి ఇచ్చారు.
 
తెలుగుతో పాటు 40కి పైగా భాషల్లో 38 వేలకు పైగా పాటలు పాడి కోట్లాది అభిమానుల హృదయాలను గెలుచుకున్న అరుదైన ప్రతిభావంతుడు జుబీన్ గార్గ్ ఆకస్మిక మరణం పట్ల హీరోయిన్ భైరవి అర్ద్య డేకా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
 
ఆమె మాట్లాడుతూ, భారతీయ చిత్ర పరిశ్రమ ఒక గొప్ప దిగ్గజాన్ని కోల్పోయింది. ఇది సినీ అభిమానులకు తీరని లోటు. జుబీన్ మన కాలంలోని అత్యుత్తమ గాయకుల్లో ఒకరు. ఆయన కేవలం కళాకారుడే కాదు, పేదలకు చేయూతనిచ్చిన మహానుభావుడు కూడా. అస్సాంలో ప్రజలు ఆయనను దేవుడిలా ఆరాధిస్తారు అని తెలిపారు.
 
జుబీన్ గార్గ్ అసమానమైన సహకారాన్ని గుర్తిస్తూ, ఆయన వారసత్వాన్ని రాబోయే తరాలకు సజీవంగా ఉంచేందుకు ప్రత్యేక స్మారక ట్రస్ట్ స్థాపనకు భూమిని కేటాయించినందుకు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మకు భైరవి కృతజ్ఞతలు తెలిపారు.
 
సంగీత దర్శకుడు, నిర్మాత, దర్శకుడు, నటుడు వంటి విభిన్న రంగాల్లో తన ప్రతిభను చూపిన జుబీన్ గార్గ్ భారతీయ సినీ ప్రపంచానికి ఎనలేని సేవలు అందించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆరోగ్యానికే కాదు.. పెళ్ళిళ్లకు కూడా ఇన్సూరెన్స్.... ఎట్టెట్టా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. కేసీఆర్ మాజీ ఓఎస్డీ వద్ద విచారణ

Jagan: ఏపీ లిక్కర్ కేసులో జగన్ సన్నిహితుడు నర్రెడ్డి సునీల్ రెడ్డి అరెస్ట్

Fibre Case: ఫైబర్‌నెట్ కేసు.. చంద్రబాబుతో పాటు 16మందిపై కేసు కొట్టివేత

Pawan Kalyan: పీఠాపురంలో 3 ఎకరాల భూమిని కొనుగోలు చేయనున్న పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments