Webdunia - Bharat's app for daily news and videos

Install App

300 మంది పిల్లల చదువు బాధ్యత నాదే.. టాలీవుడ్ హీరో గొప్పతనం

Webdunia
బుధవారం, 26 జూన్ 2019 (18:07 IST)
హ్యాపీ డేస్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన యువ కథానాయకుడు నిఖిల్‌ తన మంచి మనసును చాటుకున్నారు. నిఖిల్‌ ‘కిర్రాక్‌ పార్టీ’ సినిమా తర్వాత టీఎన్‌ సంతోష్‌ దర్శకత్వంలో వచ్చిన ‘అర్జున్‌ సురవరం’ సినిమాలో నటించారు. ఇందులో లావణ్య త్రిపాఠి కథానాయికగా నటించింది. ఈ సినిమా ఆశించిన మేరకు విజయం సాధించలేకపోయింది. 
 
ఇక ఇప్పుడు నిఖిల్‌ ‘కార్తికేయ 2’లో నటించబోతున్నారు. దీనికి చందు మొండేటి దర్శకత్వం వహిస్తుండగా, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మాణ బాధ్యతలను చూసుకుంటోంది. జూన్‌ 1న నిఖిల్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని సినిమా యూనిట్ ప్రకటించింది.
 
నిఖిల్ చేసిన మంచి పనికి అందరి నుండి ప్రశంసలు అందుతున్నాయి. ఆయన భీమవరంకు చెందిన 300 మంది చిన్నారుల చదువుకు అయ్యే ఖర్చు మొత్తం భరిస్తానని మంగళవారం ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. 
 
పాఠశాలలో విద్యార్థులతో కలిసి దిగిన ఫొటోలను షేర్‌ చేస్తూ.. ‘భీమవరానికి చెందిన ఈ 300 మంది చిన్నారులు పాఠశాలకు వెళ్లడం నుంచి చదువు పూర్తయ్యే వరకూ అన్నీ బాధ్యతలు చూసుకుంటా. ఈ గొప్ప పనిలో నాకు భాగస్వామ్యం కల్పించిన మహేందర్‌, రాంబాబుకు ధన్యవాదాలు చెప్తున్నాను. భవిష్యత్తులో ఇంకా మరికొంత మంది చిన్నారుల అభివృద్ధికి తోడ్పడతాను’ అని నిఖిల్‌ ట్వీట్‌ చేశారు.

సంబంధిత వార్తలు

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments