Webdunia - Bharat's app for daily news and videos

Install App

థియేటర్ల కలెక్షన్ల కంటే కిరాణా కొట్టు కలెక్షన్లే అధికం... : హీరో నాని

Webdunia
గురువారం, 23 డిశెంబరు 2021 (13:32 IST)
టాలీవుడ్ హీరో నాని సినిమా టిక్కెట్ల రేట్లను తగ్గిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టారు. సినిమా టిక్కెట్ల వ్యవహారంపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఏపీలో సినిమా థియేటర్ల కలెక్షన్లు, కిరాణా కొట్టు కలెక్షన్ల కంటే తక్కువగా ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 
 
హీరో నాని నటించిన తాజా చిత్రం "శ్యామ్ సింగరాయ్" శుక్రవారం విడుదలకానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం గురువారం మీడియా సమావేశం ఏర్పాటుచేసింది. ఇందులో నాని మాట్లాడుతూ, సినిమా టిక్కెట్లను ప్రభుత్వం తగ్గించిందన్నారు. ఇది సరైన నిర్ణయం కాదన్నారు. సినిమా టిక్కెట్లను ధరలు తగ్గించడంతో ఎగ్జిబిటర్లు ఆందోళన చెందుతున్నారు అని అన్నారు. 
 
సినిమా టిక్కెట్ల ధరలను తగ్గిచండం ద్వారా ప్రేక్షకులను ప్రభుత్వం అనుమతించిందన్నారు. సినిమా థియేటర్ల కంటే ఆ థియేటర్ పక్కనే ఉన్న కిరాణా కొట్టు కలెక్షన్స్ అధికంగా ఉంటాయన్నారు. టిక్కెట్ ధర ఎక్కువగా ఉన్నా కొని సినిమా చూసే సామర్థ్యం ప్రేక్షకులకు ఉందన్నారు. ఇపుడు తాను ఏది మాట్లాడినా వివాదాస్పదమే అవుతుందని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అడ్వాన్స్ బుకింగ్ సమయాన్ని ఎందుకు తగ్గించామంటే.. రైల్వే బోర్డు వివరణ

సాయుధ దళాల్లో పని చేసే జంట వేర్వేరు ప్రాంతాల్లో ఆత్మహత్య

ఐవీఎఫ్‌కి తండ్రి.. డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించిన కమలా హారిస్

అస్సాంలో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్

చట్టం ఇకపై గుడ్డిది కాదు : న్యాయ దేవతకు కొత్త రూపు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments