Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి అలా అన్నారు.... ఇకపై విలన్‌గా చేయనంటే చేయను : సోనూ సూద్

Webdunia
ఆదివారం, 20 డిశెంబరు 2020 (17:35 IST)
కరోనా వైరస్ మహమ్మారి సమయంలో ఎంతో మందికి ఆపన్న హస్తం అందించి, రియల్ హీరో అనిపించుకున్న వెండితెర ప్రతినాయకుడు సోనూ సూద్. కోవిడ్ కోవిడ్ నేపథ్యంలో ఎంతో మంది ఆపన్నులకు అండగా నిలబడ్డారు. కరోనా లాక్డౌన్ సమయంలో కష్టాల్లో చిక్కుకున్న అనేక మందిని స్వస్థాలకు చేర్చి, ప్రభుత్వాలు చేయలేని పనిని చేసి చూపించారు. ముఖ్యంగా, తన సొంత ఖర్చులతో అనేక మందిని అనేక ప్రాంతాలకు తరలించారు. అలా ప్రతి ఒక్కరితో రియల్ హీరో అనిపించుకున్నారు. 
 
అలాంటి సోనూ సూద్ ఇకపై వెండితెరపై విలన్‌గా చేయనని తాజాగా వెల్లడించారు. పైగా, తాను అలాంటి నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలను కూడా ఆయన వెల్లడించారు. 
 
ఇటీవల మెగాస్టార్‌ చిరంజీవి 152వ చిత్రం 'ఆచార్య' షూటింగులో సోనూసూద్‌ పాల్గొన్నారు. ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ "చిరంజీవి సర్‌.. ఆచార్య సినిమా యాక్షన్‌ సన్నివేశంలో నన్ను కొట్టడానికి ఇబ్బంది పడ్డారు. ఆ విషయాన్ని ఆయనే చెప్పారు. 
 
కోవిడ్‌ లాక్డౌన్ సమయంలో ఎంతో చేసి ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నావు. నిన్ను కొడితే ప్రేక్షకులు నాపై కోపం పెంచుకుంటారు" అన్ని అన్నారు. 
 
అంతేకాకుండా ఇకపై తాను విలన్‌గా సినిమాలు చేయనని, హీరోగా అవకాశాలు వస్తున్నాయని సోనూసూద్‌ తెలిపారు. తన దగ్గర ఇప్పటికే నాలుగు స్క్రిప్ట్స్‌ ఉన్నాయని, కొత్త సంవత్సరంలో కొత్త ఆరంభం చేద్దామనుకుంటున్నానని కూడా తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

30 రోజులకు మించి ఉంటున్నారా? అయితే తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోండి.. అమెరికా

మీరట్ హత్య కేసు : నిందితురాలికి ప్రత్యేక సదుపాయాలు!

ఒకే ఇంట్లో ఇద్దరు క్రికెటర్లు ఉండగా... ఇద్దరు మంత్రులు ఉంటే తప్పేంటి: కె.రాజగోపాల్ రెడ్డి (Video)

అనకాపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఎనిమిది మంది మృతి

ఏడుకొండలను 5 కొండలుగా మార్చేందుకు కుట్ర : హోం మంత్రి అనిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments