బిగ్ బాస్ హోస్ట్‌గా సమంత సక్సెస్ అయ్యిందా..? లేదా..?

Webdunia
మంగళవారం, 27 అక్టోబరు 2020 (12:42 IST)
బుల్లితెర పై రియాల్టీ షో అంటే అందరూ చెప్పే పేరు బిగ్ బాస్. ఈ షో రికార్డు స్థాయి రేటింగ్‌తో దూసుకెళుతూ.. ఇండియాలోనే నెంబర్ 1 ఛానల్‌గా నిలిచింది. దీనికి కారణం బిగ్ బాసే. ఇదిలా ఉంటే... బిగ్ బాస్ 4కి హోస్ట్‌గా ఉన్న టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రస్తుతం వైల్డ్ డాగ్ మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా కులుమనాలిలో షూటింగ్ జరుపుకుంటుంది.
 
నూతన దర్శకుడు సోల్మాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే.. నాగ్ కులుమనాలి వెళ్లడంతో బిగ్ బాస్ హోస్ట్‌గా సమంతకి ఛాన్స్ ఇచ్చారు. దీంతో సమంత హోస్ట్‌గా ఎలా చేస్తుందనే క్యూరియాసిటీ ఏర్పడింది.
 
సమంత తనదైన స్టైల్లో నవ్వుతూ... నవ్విస్తూ... బాగానే ఆకట్టుకుంది. అయితే.. తెలుగు భాషపై పట్టు లేకపోవడంతో అక్కడక్కడా తడబడింది. ఈ విషయం తనకు ముందే తెలుసు కాబట్టి.. తెలుగులో మాట్లాడటంలో కాస్త తడబడితే ఏమీ అనుకోవద్దు క్షమించేయండి అంటూ ముందే చెప్పేసింది.
 
ఆమె చాలా ఎమోషనల్‍ అని రియాక్షన్స్ లోనే తెలిసిపోయింది. కంటెస్టెంట్లు ఏడుస్తుంటే సమంత కళ్లు కూడా చెమర్చాయి. బిగ్‍బాస్‍ హోస్ట్ ఇంత ఎమోషనల్‍గా వుంటే కుదరదు. అవసరం అనుకున్నప్పుడు గట్టిగా క్లాసులు పీకుతుండాలి.
 
ఇక అసలు విషయానికి వస్తే.. సమంత బిగ్ బాస్ హోస్ట్‌గా సక్సస్ సాధించిందా..? లేదా అంటే... చాలా మంది చెప్పేది ఏంటంటే.. హోస్ట్‌గా బాగానే చేసింది కానీ.. ఓ అదరగొట్టింది అనేలా చేయలేదు. ఇంకా బాగా చేసుండాల్సింది అనే మాట వినిపిస్తుంది.
 
ఇదిలావుంటే సమంత ఈ కార్యక్రమానికి హోస్టుగా వచ్చినందుకు సుమారు 2 కోట్ల పారితోషికం తీసుకున్నదంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. మరి నిజంగా అంత పారితోషికం ఇచ్చి వుంటారా అనేది డౌటే. ఏముందిలో... ఏదో ఒక వార్త రాసి పడేస్తే పోలా అని అనుకునేవారు ఎవరైనా ఇది క్రియేట్ చేసి వుండొచ్చని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే వచ్చే వారం కూడా సమంతనే హోస్ట్. మరి.. వచ్చే వారం ఏం చేస్తుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దొంగలు కొట్టేస్తారని 25 తులాల బంగారాన్ని పాత దిండులో పెట్టింది, దాన్ని కాస్తా చెత్తలో పడేసారు...

కాస్త అలసటగా వుంది, బెడ్ పైన పడుకున్న ఎల్బీ నగర్ ఎస్సై, తెల్లారి నిద్ర లేపితే...

రీహాబిలిటేషన్-కేంద్రీకృత వికలాంగుల వాకథాన్‌ను నిర్వహించిన హెచ్ఏసిహెచ్ సువిటాస్

భద్రాద్రి రైల్వే స్టేషనులో బాంబు సంచిని కొరికిన కుక్క, పేలిపోయి ట్రాక్ మీద పడింది

Kavitha on AP Deputy CM: పవన్‌పై ఫైర్ అయిన కల్వకుంట్ల కవిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments