Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగా కాంపౌండ్‌లోకి అడుగుపెడుతున్న "గీత గోవిందం" భామ

Webdunia
సోమవారం, 8 ఏప్రియల్ 2019 (16:06 IST)
అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమాని మొదలు పెట్టనున్నారు. అతి త్వరలో ఈ సినిమా షూటింగ్ సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ సినిమాపైన చాలా కాలంగా రూమర్స్ వినిపిస్తున్నప్పటికీ ఈ సినిమా గురించిన ముఖ్య వివరాలను ఫిలిం యూనిట్ ఇప్పటివరకు వెల్లడించలేదు. 
 
ఇది అటుంచితే సోమవారం అల్లు అర్జున్ పుట్టిన రోజును జరుపుకున్నారు. దీన్ని పురస్కరించుకుని మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ సినిమా అనౌన్స్ చేసింది. ఈ సినిమా త్రివిక్రమ్ సినిమా తర్వాత సెట్స్ పైకి వెళ్లనుంది. ఇది వరకే ఈ సినిమా గురించి వార్తలు వచ్చినా ప్రస్తుతం సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. సుకుమార్ ఒక ఆసక్తికరమైన కథని బన్నీ కోసం తయారు చేశారట. 
 
ఇక ఈ సినిమాలో హీరోయిన్ విషయానికి వస్తే, ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించనుంది. ఇప్పటికే మహేష్ బాబు తదుపరి చిత్రంలో నటించే అవకాశాన్ని కైవసం చేసుకున్న రష్మిక, ఇప్పుడు ఈ చిత్రంలో బన్నీ సరసన నటించి అగ్ర కథానాయికల లిస్ట్‌లో చేరిపోతుంది అని భావించవచ్చు. ఈ చిత్రం ద్వారా రష్మిక మందన్నా మెగా కాంపౌండ్‌లోకి అడుగుపెట్టనుందని చెప్పొచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments