Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగా కాంపౌండ్‌లోకి అడుగుపెడుతున్న "గీత గోవిందం" భామ

Webdunia
సోమవారం, 8 ఏప్రియల్ 2019 (16:06 IST)
అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమాని మొదలు పెట్టనున్నారు. అతి త్వరలో ఈ సినిమా షూటింగ్ సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ సినిమాపైన చాలా కాలంగా రూమర్స్ వినిపిస్తున్నప్పటికీ ఈ సినిమా గురించిన ముఖ్య వివరాలను ఫిలిం యూనిట్ ఇప్పటివరకు వెల్లడించలేదు. 
 
ఇది అటుంచితే సోమవారం అల్లు అర్జున్ పుట్టిన రోజును జరుపుకున్నారు. దీన్ని పురస్కరించుకుని మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ సినిమా అనౌన్స్ చేసింది. ఈ సినిమా త్రివిక్రమ్ సినిమా తర్వాత సెట్స్ పైకి వెళ్లనుంది. ఇది వరకే ఈ సినిమా గురించి వార్తలు వచ్చినా ప్రస్తుతం సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. సుకుమార్ ఒక ఆసక్తికరమైన కథని బన్నీ కోసం తయారు చేశారట. 
 
ఇక ఈ సినిమాలో హీరోయిన్ విషయానికి వస్తే, ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించనుంది. ఇప్పటికే మహేష్ బాబు తదుపరి చిత్రంలో నటించే అవకాశాన్ని కైవసం చేసుకున్న రష్మిక, ఇప్పుడు ఈ చిత్రంలో బన్నీ సరసన నటించి అగ్ర కథానాయికల లిస్ట్‌లో చేరిపోతుంది అని భావించవచ్చు. ఈ చిత్రం ద్వారా రష్మిక మందన్నా మెగా కాంపౌండ్‌లోకి అడుగుపెట్టనుందని చెప్పొచ్చు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments