Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఘంటసాల కుమారుడు ఘంటసాల రత్నకుమార్ కన్నుమూత

Webdunia
గురువారం, 10 జూన్ 2021 (09:06 IST)
సినీ దిగ్గజ నేపథ్యగాయకుడు, దివంగత ఘంటసాల వేంకటేశ్వర రావు కుమారుడు ఘంటసాల రత్నకుమార్ కన్నుమూశారు. ఆయన గురువారం తెల్లవారుజామున నగంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 
 
తెలుగు, తమిళ, మలయాళ, హిందీ చిత్ర సీమల్లో డబ్బింగ్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈయన... ఇటీవల కరోనా బారినపడిన ఆయన కోలుకున్నారు. రెండు రోజల క్రితం నిర్వహించిన పరీక్షల్లో నెగటివ్‌గా తేలడం గమనార్హం. అయితే, ఆయన అస్వస్థతకు లోనుకావడంతో ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ వచ్చారు. ఈ క్రమంలో ఆయన పరిస్థితి విషయమించడంతో తుదిశ్వాస విడిచారు. 
 
రత్నకుమార్ మరణవార్తతో తెలుగు చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. రత్నకుమార్‌కు కిడ్నీ సమస్యలు ఉన్నాయని, డయాలసిస్ చేయించుకుంటున్నారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.
 
డబ్బంగ్ ఆర్టిస్టుగా రత్నకుమార్ దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. బాలీవుడ్‌లోనూ పలు చిత్రాలకు తన గాత్రాన్ని అందించారు. ఎనిమిది గంటలపాటు ఏకధాటిగా డబ్బింగ్ చెప్పి ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లోనూ రత్నకుమార్ స్థానం సంపాదించుకున్నారు. 
 
తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఇప్పటివరకు ఆయన వెయ్యికిపైగా సినిమాలకు డబ్బింగ్ చెప్పారు. తెలుగులో ‘వీరుడొక్కడే’, ‘ఆట ఆరంభం’ సహా 30కి పైగా సినిమాలకు రత్నకుమార్ మాటలు అందించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Karnataka: ఉడిపికి గుంటూరు వాసులు.. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

Rachakonda: స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం.. ఓ మహిళతో పాటు విటుడి అరెస్ట్

పాకిస్థాన్ పనిబట్టిన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి!!

సరిహద్దుల్లో ప్రశాంతత - 19 రోజుల తర్వాత వినిపించని తుపాకుల శబ్దాలు!!

Andhra Pradesh: రక్షణ సిబ్బంది ఇళ్లకు ఆస్తి పన్ను మినహాయింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments