ఏఆర్ రెహ్మాన్ ప్రపంచంలోనే అత్యుత్తమైన వ్యక్తి : సైరా బాను

ఠాగూర్
సోమవారం, 25 నవంబరు 2024 (11:27 IST)
సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్‌పై ఆయన భార్య సైరా బాను ప్రశంసల వర్షం కురిపించారు. తన భర్త ప్రపంచంలోనే అత్యుత్తమ వ్యక్తి అని ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ఆదివారం ఓ ఆడియోను విడుదల చేశారు. రెహమాన్ సంగీత బృందంలో బాసిస్ట్‌గా ఉన్న మోహిని డే అనే అమ్మాయి కారణంగానే ఈ విడాకులు అంటూ ప్రచారం జరుగుతోంది. రెహ్మాన్ విడాకులు తెరపైకి వచ్చిన రోజే... మోహిని డే భర్త నుంచి విడిపోతున్నట్టుగా పోస్టు పెట్టడం ఈ ఊహాగానాలకు నాంది పలికింది.
 
ఈ ప్రచారంపై సైరా బాను స్పందించారు. రెహ్మాన్ బంగారం వంటి వ్యక్తి అని, ఆయననేమీ అనొద్దని విజ్ఞప్తి చేశారు. గత కొన్ని నెలలుగా తాను ఆరోగ్యంగా లేనని, అందుకే రెహ్మాన్ నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్నానని వెల్లడించారు. ఆ మేరకు సైరా బాను న్యాయవాది వందనా షా ఓ వాయిస్ క్లిప్‌ను విడుదల చేశారు.
 
'నేను సైరా బానును మాట్లాడుతున్నాను. ప్రస్తుతం నేను ముంబైలో ఉన్నాను. గత కొన్ని నెలలుగా శారీరకంగా నా పరిస్థితేమీ బాగాలేదు. అందుకే రెహ్మాన్ నుంచి విడాకులు కోరుకుంటున్నాను. ఇదే మా విడాకులకు కారణం. యూట్యూబ్‌కు, యావత్ యూట్యూబర్లకు, తమిళ మీడియాకు నేను చేసే విజ్ఞప్తి ఒక్కటే... దయచేసి రెహ్మాన్ గురించి చెడుగా ప్రచారం చేయవద్దు. నా అనారోగ్యం వల్లే చెన్నై నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది.
 
నేను ఎక్కడున్నానో నాకు తెలుసు... కానీ మీరే (మీడియా) సైరా ఎక్కడుందంటూ వెతుకుతున్నారు. నేను చికిత్స తీసుకునేందుకు ముంబై వచ్చాను. నా పిల్లలను కానీ, రెహ్మాన్‌ను కానీ ఎవరినీ నేను డిస్ట్రబ్ చేయదలుచుకోలేదు. కానీ రెహ్మాన్ ఓ అద్భుతమైన వ్యక్తి. అతడ్ని అలా వదిలేయండి. నేను అతడ్ని ఎంతగా ప్రేమించానో చెప్పడానికి ఇదే నిదర్శనం. అతడు కూడా నన్ను అలాగే ప్రేమించాడు. దయచేసి అతడిపై తప్పుడు ఆరోపణలు చేయకండి. అతడ్ని బజారుకీడ్చవద్దు. త్వరలోనే చికిత్స పూర్తి చెన్నై వస్తాను' అంటూ సైరా బాను తన వాయిస్ నోట్‌లో వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సుమత్రా దీవుల్లో భారీ భూకంపం... రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదు

Mumbai woman: కన్నతల్లే కుమార్తెను వ్యభిచార కూపంలోకి దించేందుకు ప్రయత్నం

నాలుగేళ్ల బాలుడు కిడ్నాప్ అయ్యాడు.. ఆపై హత్యకు గురయ్యాడు...

హాంకాంగ్‌లో భారీ అగ్నిప్రమాదం: 44 మంది మృతి.. వందలాది మంది గల్లంతు

రైతులకు నష్ట పరిహారం ఇస్తానని.. ఏదో గుడిలో లడ్డూ అంటూ డైవర్ట్ చేసేస్తాడు.. జగన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

తర్వాతి కథనం
Show comments