Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పటివరకు "గదర్-2" కోసం వేచి చూడాల్సిందే..

Webdunia
సోమవారం, 28 ఆగస్టు 2023 (19:25 IST)
బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ హీరోగా అనిల్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గదర్-2. ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం నమోదు చేసుకుంది. 60 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు రూ.450 కోట్ల వసూళ్ళను రాబట్టింది. థియేటర్లలో ఇప్పటికీ ఈ చిత్రం కలెక్షన్లు తగ్గలేదు. 
 
ఈ క్రమంలో ఈ చిత్రం ఓటీటీలో ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందా అని కోట్లాది మంది ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు. ప్రస్తుతం ఒక చిత్రం విడుదలైన రెండు మూడు వారాల్లోనే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. అదేవిధంగా గదర్-2 కూడా స్ట్రీమింగ్ అవుతుందనే ప్రచారం సాగుతోంది. దీనిపై చిత్ర దర్శకుడు అనిల్ శర్మ స్పందించారు. 
 
'ప్రస్తుతం ప్రేక్షకులు "గదర్‌-2" థియేటర్‌లో చూసేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ఒరవడి ఇంకొన్ని రోజులు కొనసాగుతుంది. నాకు తెలిసినంత వరకూ మరో ఆరు నుంచి ఎనిమిది నెలల తర్వాతే సినిమా ఓటీటీలోకి వస్తుంది. అప్పటివరకూ సినిమాను థియేటర్‌లోనే చూస్తారని అనుకుంటున్నా. ప్రేక్షకులు చూపిస్తున్న ఉత్సాహమే మా సినిమాకు అతిపెద్ద విజయం" అని చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకట రెడ్డి అరెస్టు.. 14 రోజుల రిమాండ్

డిక్లరేషన్‌పై సంతకం చేయాల్సివస్తుందన్న భయంతోనే జగన్ డుమ్మా : మంత్రి అనిత

కలెక్టరేట్‌లో తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్న కానిస్టేబుల్.. ఎక్కడ?

నలుగురు వికలాంగ కుమార్తెలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి.. ఎక్కడ?

నల్లవాగును కబ్జా చేసి వెంచర్ వేసిన వైకాపా నేత - హైడ్రా నోటీసులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

పాలలో తేనె వేసుకుని తాగితే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments