Webdunia - Bharat's app for daily news and videos

Install App

రజనీకాంత్ సినిమా షూటింగ్‌కు సమీపంలో అగ్నిప్రమాదం... ఎక్కడ?

ఠాగూర్
ఆదివారం, 15 సెప్టెంబరు 2024 (09:10 IST)
సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త "కూలీ" చిత్రం షూటింగ్ విశాఖపట్టణంలో జరుగుతుంది. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణ పనులు విశాఖ కంటైనర్ టెర్మినల్ సమీపంలో గత కొన్ని రోజులుగా చిత్రీకరిస్తున్నారు. అయితే, షూటింగ్ జరుగుతున్న సమయంలో ఉన్నట్టుండి ఓ నౌక వద్ద మంటలు చెలరేగాయి. ఈ ఘటన ఆదివారం ఉదయం జరిగింది. 
 
విశాఖ బీచ్ రోడ్డులోని కంటైనర్ టెర్మినల్ వద్ద చిత్రీకరణ జరుగుతుండగా, ఓ కార్గో షిప్ లిథియం అయాన్ బ్యాటరీల లోడుతో పోర్టు వద్దకు వచ్చింది. ఆ నౌక వద్ద మంటలు చెలరేగడంతో కూలీ సెట్స్‌పై ఆందోళన నెలకొంది కంటైనర్ టెర్మినల్‌కు చాలా దగ్గరగా షూటింగ్ జరుపుతుండటమే అందుకు కారణంగా ఉంది. సమాచారం అందుకున్న అగ్నిమాపకదళ సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై స్థానిక పోలీసులు ఆరా తీస్తున్నారు. 
 
కాగా, రజనీకాంత్ హీరోగా యంగ్ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. సన్ పిక్చర్స్ పతాకంపై నిర్మాత కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో నిర్మించే ఈ చిత్రంలో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున సైమన్ అనే పవర్‌ఫుల్ గ్యాంగ్‌‍స్టర్ పాత్రలో నటిస్తున్నారు. నాగార్జున లుక్‌ను ఇటీవలే ఈ చిత్ర బృందం విడుదల చేసిన విషయం తెల్సిందే. అలాగే, ఇందులో శృతిహాసన్, ఉపేంద్ర, సత్యరాజ్ తదితరులు ఇతర పాత్రలను పోషిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో కొత్త మద్యం పాలసీ.. రూ.99కే క్వార్టర్ బాటిల్!

తిరుపతి లడ్డూ తయారీలో ఆవు నెయ్యి స్థానంలో జంతువుల కొవ్వు కలిపారా?

దేశంలో జమిలి ఎన్నికలు తథ్యం.. అమలుకు ప్రత్యేక కమిటీ : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ముంబై నటినే కాదు.. ఆమె సోదరుడిని కూడా వేధించిన పీఎస్ఆర్ ఆంజనేయులు

బోను తాళం పగలగొట్టుకొని మరీ బయటకు వచ్చిన పులి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

జీడి పప్పు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments