Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫేక్ న్యూస్ రాసే వెబ్ సైట్ల పైన ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాము

Webdunia
మంగళవారం, 5 మే 2020 (14:09 IST)
హీరో విజయ్ దేవరకొండ తెలుగులో వెబ్‌సైట్లు కావాలనే విపరీతంగా తప్పుడు వార్తలు రాస్తున్నాయని.. అందులో ముఖ్యంగా రెండు మూడు వెబ్‌సైట్స్ మాత్రం ఏ మాత్రం అర్హత లేకుండా ఇంటర్వ్యూలు ఇవ్వకపోతే కూడా కక్ష పెట్టుకుని రాస్తున్నారంటూ మండిపడ్డాడు. విజయ్ దేవరకొండ ఈ విషయంపై మాట్లాడిన తరువాత చిరంజీవి, మహేష్ బాబు, రవితేజ, అల్లరి నరేష్, వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, కొరటాల శివ తదితరులు విజయ్ దేవరకొండకు మద్దతు తెలిపారు.
 
తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ఫేక్ న్యూస్, ఫేక్ వెబ్సైట్స్‌ను ఖండిస్తోంది. అసత్యంగా వార్తలు రాసే వెబ్ సైట్స్‌ను వ్యతిరేకిస్తోంది. హీరోలు దర్శకులు విజయ్ దేవరకొండకు సపోర్ట్ చెయ్యడాన్ని తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి సమర్థిస్తుంది. ఒక మనిషి తన స్తోమతకు తగ్గట్లు సహాయం చేస్తాడు, దానిపై కూడా కామెంట్స్ చెయ్యడం కరెక్ట్ కాదు. 
 
సినిమా యాడ్స్ వలన రెవిన్యూ పొందుతూ ఇలా సినిమా వారిపైన ఆ వెబ్ సైట్ ఆర్టికల్స్ రాయడం కరెక్ట్ కాదు, ఈ విషయం పైన లాక్ డౌన్ పూర్తి తరువాత అందరితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాము, ఎవరికైనా ఫేక్ న్యూస్ రాసే వెబ్సైట్స్ పైన పిర్యాదు చేస్తే మేము చర్యలు తీసుకుంటామని తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి తెలిపింది.

సంబంధిత వార్తలు

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments