Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్వత్‌ వున్నా సినిమారంగంలో సర్దుకుపోవాలి : రామజోగయ్య శాస్త్రి

Webdunia
బుధవారం, 4 జనవరి 2023 (15:10 IST)
Ramajogaiah Shastri
ఎంత మేథావి అయినా ఎంత విద్వత్తు వున్నా మనం రాసే పదాలు, పలికే మాటలు పామరుడు నుండి పెద్దవారి వరకు అర్థమయ్యేలా వుండాలని గీత రచయిత రామజోగయ్య శాస్త్రి అన్నారు. చిరంజీవి నటించిన ఆచార్య సినిమాలో ‘లాహే.. లాహే.. అంటూ శివునిపై సాగే పాటలో అర్థవంతమైన సాహిత్యంతోపాటు అప్పటి తరానికి చెందిన గ్రాంథికం కూడావుంటుంది. ఇది తెలియని ఇప్పటితరం ఇలా రాస్తే ఎలా? అనే చర్చ అప్పట్లో పెట్టారు. దీనిపై రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ, ఆ పాటను అలానే రాయాలి అంటూ వివరించారు.
 
ఇక తాజాగా వీరనరసింహారెడ్డి, వాల్తేర్‌ వీరయ్య చిత్రాలతోపాటు తమిళ విజయ్‌ ‘వారసుడు’లోనూ పాటలు రాశారు. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలయ్యే సినిమాలు అవే. మిగిలిన ఏ సినిమాలు విడుదల కావడంలేదు. ఒకరకంగా మూడు సినిమాలకు పనిచేసిన ఏకైక వ్యక్తి రామజోగయ్య శాస్త్రి మాత్రమే. ఇలా రాయడం మనం కోరుకుంటే జరగదు. అప్పుడప్పుడు అలా జరిగిపోతుంటాయని చెబుతున్నారు. మనకు ఎంత విద్వత్‌ వున్నా నేను ఇలానే రాస్తాను అనే గిరీ గీసుకు కూర్చుంటే సినిమారంగంలో చెల్లదు. పరిస్థితితులను బట్టి సర్దుకుపోయి దర్శక నిర్మాతలకు, సంగీత దర్శకులకు అనుగుణంగా నడుచుకుంటూ వుండాలని గ్రహించానని పేర్కొన్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కరోనా రోగిపై అత్యాచారం... అంబులెన్స్ డ్రైవర్‌కు జీవితఖైదు

పరీక్షల్లో వైద్య విద్యార్థుల మాల్ ప్రాక్టీస్ - పట్టుబడిన మరో ఇద్దరు

ఎలుగుబంటికి నరకం చూపించిన గ్రామస్థులు!!

మామను గొడ్డలితో నరికి ... తలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన అల్లుడు

తనయుడుతో హైదరాబాద్ చేరుకున్న పవన్ కళ్యాణ్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments