Webdunia - Bharat's app for daily news and videos

Install App

11 యేళ్ల వైవాహిక బంధానికి ముంగింపు పలికిన ఈషా డియోల్

ఠాగూర్
బుధవారం, 7 ఫిబ్రవరి 2024 (10:28 IST)
బాలీవుడ్ చిత్రపరిశ్రమకు చెందిన మరో హీరోయిన్ తన వైవాహిక బంధానికి తెరదించారు. తన భర్తతో ఉన్న 11 యేళ్ల వివాహబంధానికి ముగింపు పలికారు. ఆమె ఎవరో కాదు.. ప్రముఖ సీనియర్ నటి హేమమాలిని కుమార్తె ఈషా డియోల్. ఈమె తన భర్త భర్త తఖ్తానీతో ఉన్న వివాహ బంధాన్ని తెంచుకున్నారు. భర్తతో కలిసి సంయుక్త ప్రకటన చేశారు. పరస్పర అంగీకారంతో, స్నేహపూర్వకంగా విడిపోతున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం తమ బిడ్డల భవిష్యత్తే ముఖ్యమని ప్రకటించారు. అందువల్ల ఈ క్లిష్ట సమయంలో తమ వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించవద్దని ఆమె మీడియాకు, అభిమానులకు విజ్ఞప్తి చేశారు. 
 
కాగా, హేమమాలిని - ధర్మేంద్ర కుమార్తెగా గత 2002లో "కోయి మేర్ దిల్ సే పూఛే" చిత్రంతో సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఈషా డియోల్... ఆ తర్వాత పలు హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఆ తర్వాత నటనకు దూరమయ్యారు. 2012లో భరత్ తఖ్తానీ అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకున్నారు. వీరికి మిరాయా, రాధ్యా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వివాహం, పిల్లలు కారణంగా కొంతకాలం పాటు నటనకు బ్రేక్ తీసుకున్న ఈషా డియోల్.. కేక్ వాక్ అనే ష్టార్ ఫిల్మ్ ద్వారా మళ్లీ తెరంగేట్రం చేశారు. ఈ నేపథ్యంలో ఇపుడు తన వివాహ బంధానికి ముంగిపు పలుకుతున్నట్టు వారు ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Student: రామానాయుడు ఫిల్మ్ స్కూల్‌లో 25 ఏళ్ల విద్యార్థినిని వేధించిన ప్రొఫెసర్

ఉత్తర తెలంగాణాలో దంచికొట్టనున్న వర్షాలు...

Pawan Kalyan: జనసేన ప్రాంతీయ పార్టీగా ఉండాలని నేను కోరుకోవడం లేదు- పవన్ కల్యాణ్

బూట్లలో దూరిన పాము కాటుతో మృతి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్

Roja: ఆడుదాం ఆంధ్ర కుంభకోణం.. ఆర్కే రోజా అరెస్ట్ అవుతారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments