Webdunia - Bharat's app for daily news and videos

Install App

మలేరియా బారినపడిన ఇమ్రాన్ హష్మి...

బాలీవుడ్‌ హీరో హీరో ఇమ్రాన్‌ హష్మి మలేరియా వ్యాధి బారినపడ్డాడు. ప్రస్తుతం ఆయన హాస్పిటల్‌‍లో చికిత్స పొందుతున్నాడు. ఇమ్రాన్ తాజా చిత్రం ''రాజ్‌ రీబూట్'' విడుదలకు సిద్ధంగా ఉంది. ''రాజ్‌ రీబూట్‌'' సినిమా

Webdunia
శుక్రవారం, 16 సెప్టెంబరు 2016 (09:45 IST)
బాలీవుడ్‌ హీరో హీరో ఇమ్రాన్‌ హష్మి మలేరియా వ్యాధి బారినపడ్డాడు. ప్రస్తుతం ఆయన హాస్పిటల్‌‍లో చికిత్స పొందుతున్నాడు. ఇమ్రాన్ తాజా చిత్రం ''రాజ్‌ రీబూట్'' విడుదలకు సిద్ధంగా ఉంది. ''రాజ్‌ రీబూట్‌'' సినిమా విషయానికి వస్తే.. రాజ్ సిరీస్‌లో వస్తున్న చివరి సినిమా ఇది. ఈ సిరీస్‌లో వచ్చిన చిత్రాలన్నీ దాదాపుగా ప్రేక్షకుల్ని అలరించాయి. ఈ సిరీస్‌ పట్ల ఆడియన్స్‌లో ప్రత్యేకమైన క్రేజ్‌ ఏర్పడింది. 
 
ఈ చిత్రంలో కృతి కర్బంద హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ హీరోకి జ్వరం తగ్గే వరకు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా వైద్యులు ఆయనకు సూచించారు. దీంతో.. తన తాజా చిత్రం ''రాజ్ రీబూట్'' ప్రచార కార్యక్రమంలో ఇమ్రాన్ హష్మీ పాల్గొనడం లేదన్న విషయాన్ని ఆయన కుటుంబసభ్యులు చెప్పారు. 
 
కాగా, విక్రమ్ భట్ దర్శకత్వంలో తెరకెక్కిన ''రాజ్ రీబూట్'' చిత్రం యూనిట్ మూడు రోజుల క్రితం జైపూర్లో ప్రచార కార్యక్రమం నిర్వహించింది. ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఇమ్రాన్ హష్మీ జ్వరం కారణంగా తిరిగి ముంబైకి వెళ్లిపోయాడు. మిగిలిన యూనిట్ సభ్యులు అక్కడి నుంచి ఢిల్లీకి చేరుకుంటారని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రసన్న ఇంటిపై దాడి.. మూడు హత్యలు, ఆరు హత్యాయత్నాలు, 12 దాడులు: జగన్ ఫైర్

Hyderabad: రోజూ మద్యం తాగి వస్తే భరించేదెవరు? బండరాయితో కొట్టి చంపేసిన భార్య

EV Cycle: ఎలక్ట్రిక్ సైకిల్‌ను తయారు చేసిన ఇంటర్ విద్యార్థి సిద్ధు.. పవన్ ఏం చేశారంటే?

Bangalore: భార్యను నేలపై పడేసి, గొంతుపై కాలితో తొక్కి చంపేసిన భర్త

సీమాంధ్ర పాలకుల కంటే తెలంగాణకు కేసీఆర్ ద్రోహమే ఎక్కువ: రేవంత్ రెడ్డి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments