శ్రీదేవి మృతిపై దుష్ప్రచారం వద్దు... ప్లీజ్ : ఏక్తా కపూర్

నటి శ్రీదేవి మరణంపై జాతీయ మీడియాలో వస్తున్న కథనాలపై బాలీవుడ్ నటి ఏక్తా కపూర్ స్పందించారు. శ్రీదేవి మరణంపై దుష్ప్రచారం చేయొద్దనీ ఆమె విజ్ఞప్తి చేశారు.

Webdunia
సోమవారం, 26 ఫిబ్రవరి 2018 (17:11 IST)
నటి శ్రీదేవి మరణంపై జాతీయ మీడియాలో వస్తున్న కథనాలపై బాలీవుడ్ నటి ఏక్తా కపూర్ స్పందించారు. శ్రీదేవి మరణంపై దుష్ప్రచారం చేయొద్దనీ ఆమె విజ్ఞప్తి చేశారు. సర్జరీల కారణంగానే ఆమె మృతి చెందిందని, సర్జరీలు వికటించడంతో గుండెపోటు వచ్చిందని సోషల్ మీడియాలో కథనాలు వెల్లువెత్తుతున్నాయి. వీటిపై ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 
 
ఈ ప్రచారంపై ఆమె స్పందిస్తూ, చెడు ప్రచారం చేసేవాళ్లు ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచన చేసింది. ఎలాంటి సర్జరీలు చేయించుకోకుండా, హృదయ పనితీరు మెరుగ్గా ఉన్న వారికి కూడా గుండెపోటు వస్తుందన్న విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవాలని కోరింది. 
 
ఎలాంటి హృద్రోగ సమస్యలూ లేకపోయినప్పటికీ, ప్రపంచంలో ఒక శాతం మందికి హఠాత్తుగా గుండెపోటు వస్తుందని తనకు తెలిసిన డాక్టర్ ఒకరు చెప్పిన విషయాన్ని ఏక్తా తన ట్వీట్ లో పేర్కొంది. పుకార్లు ప్రచారం చేసేవారు దీనిని గుర్తుపెట్టుకోవాలని ఆమె సూచించింది. ఉన్నవీ లేనివీ ప్రచారం చేసి, బాధపెట్టవద్దని నెటిజన్లకు ఏక్తా కపూర్ విజ్ఞప్తి చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ నెయ్యి కేసు: తితిదే జీఎం కె సుబ్రహ్మణ్యం అరెస్ట్, వైవీ సుబ్బారెడ్డిని కూడానా?

సైక్లోన్ దిత్వా వచ్చేస్తోంది.. తమిళనాడులో భారీ వర్షాలు.. శనివారం నాటికి..

కేటీఆర్ ఐరన్ లెగ్.. అందుకే కవిత పార్టీ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది.. కడియం శ్రీహరి

మైండ్‌లెస్ మాటలు మాట్లాడేవారు ఉపముఖ్యమంత్రులవుతున్నారు: జగదీష్ రెడ్డి (video)

ఆరోగ్యానికే కాదు.. పెళ్ళిళ్లకు కూడా ఇన్సూరెన్స్.... ఎట్టెట్టా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments