Webdunia - Bharat's app for daily news and videos

Install App

డీజే (దువ్వాడ జగన్నాథమ్) కథ ఎలా ఉందంటే.. క్లైమాక్స్‌ లీక్...

అల్లు అర్జున్, పూజా హెగ్డే కాంబినేషన్‌లో హరీష్ శంకర్ దర్శత్వంలో దిల్ రాజు నిర్మించిన చిత్రం డీజే దువ్వాడ జగన్నాథమ్. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం విడుదలైంది. రూ.70 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని

Webdunia
శుక్రవారం, 23 జూన్ 2017 (08:41 IST)
అల్లు అర్జున్, పూజా హెగ్డే కాంబినేషన్‌లో హరీష్ శంకర్ దర్శత్వంలో దిల్ రాజు నిర్మించిన చిత్రం డీజే దువ్వాడ జగన్నాథమ్. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం విడుదలైంది. రూ.70 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఫ్యాన్స్ షో వేయగా మంచి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.
 
అయితే, ఈ చిత్రం కథపై దర్శకుడు హరీష్ శంకర్ స్పందిస్తూ, 'సినిమాల్లో సందేశాలు చెబితే ఎవరూ వినరు. 70-80 కోట్లు ఖర్చుపెట్టి సినిమా తీసేవారు ప్రేక్షకులకు వినోదాన్ని అందించాలనుకుంటారే తప్ప సందేశాలివ్వాలనుకోరు. ఎవరి మనోభావాలనూ దెబ్బతీయాలనీ అనుకోరు' అని స్పష్టం చేశారు. 
 
ఇందులో బన్నీ చేసింది రెండు పాత్రలా? ఒక పాత్రలో రెండు షేడ్సా అనేది తెరమీద చూడాలి. రెండు గెటప్పులను విడుదల చేసినప్పటి నుంచీ ఈ విషయమై అందరిలోనూ ఆసక్తి పెరిగింది. మనదగ్గర హీరోలు బ్రాహ్మిణ పాత్రల్లో అరుదుగా కనిపిస్తుంటారు కాబట్టి ఈ సినిమా మరేదో సినిమాకు పోలికేమోననే గాసిప్స్‌ వచ్చాయి. వాటిలో నిజం లేదు. డీజే వినోదాత్మకంగా ఉంటూనే ఇంటెన్సిటితో కూడిన ఎమోషనల్‌ చిత్రంగా సాగుతుందన్నారు. 
 
డీజేలో సందేశాలేం లేవు. సినిమాను చూసి పొందిన స్ఫూర్తి మహా అయితే కొన్ని గంటలు.. కొన్నాళ్లు.. మరీ అద్భుతాలైతే కొన్ని నెలలు ఉంటాయన్నది నా వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు. ఇక క్లైమాక్స్‌ గురించి చెబుతూ ‘‘డీజే క్లైమాక్స్‌లో ఫైట్‌ లేదు. క్లైమాక్స్‌ ఎన్ని సార్లు ఆలోచించినా ఫైట్‌ను డిమాండ్‌ చేయలేదు. ప్రీ ఇంటర్వెల్‌ ఫైట్‌ ఉంది. నా కెరీర్‌లో బెస్ట్‌ ఫైట్‌ అదే. ఏ కథలో అయినా హీరోదే అంతిమ విజయం అని అందరికీ తెలుసు. మన తెలుగు సినిమాలు చాలా వరకు ఫైట్‌ సీన్లతో అల్యూమినియం ఫ్యాక్టరీలో ఎండ్‌ అయిపోతుండటం నాకు నచ్చలేదు. ‘సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌’లో ఆ ట్రెండ్‌ని కాస్త బ్రేక్‌ చేయడానికి ట్రై చేశా. ఈ సినిమాలో పూర్తిగా సక్సెస్‌ అయ్యాను’’ అని అన్నారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments