Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీడియా నాశనం చేసింది... ఇప్పుడు అప్పుడు ఎప్పుడూ అంతేకదా...(వీడియో)

పూరీ జగన్నాథ్ చాలా ఫీలయ్యారు. రేటింగ్స్ కోసం మీడియా తన జీవితాన్ని నాశనం చేసిందని వాపోయారు. హైదరాబాద్‌లో వెలుగు చూసిన డ్రగ్స్ దందాలో పూరీ పాత్ర ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో సిట్ బృందం ఎదుట పూరీ హాజరయ్యారు. మొత్తం 11 గంటల పాటుసాగిన విచారణ అనంతరం పూర

Webdunia
గురువారం, 20 జులై 2017 (20:48 IST)
పూరీ జగన్నాథ్ చాలా ఫీలయ్యారు. రేటింగ్స్ కోసం మీడియా తన జీవితాన్ని నాశనం చేసిందని వాపోయారు. హైదరాబాద్‌లో వెలుగు చూసిన డ్రగ్స్ దందాలో పూరీ పాత్ర ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో సిట్ బృందం ఎదుట పూరీ హాజరయ్యారు. మొత్తం 11 గంటల పాటుసాగిన విచారణ అనంతరం పూరీని సిట్ బృందం అధికారులు వదిలిపెట్టారు. 
 
అనంతరం పూరీ జగన్నాథ్ తన ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోలో పూరీ పలు విషయాలను చెప్పుకొచ్చారు. సిట్ విచారణకు వెళ్లానని, వారికి పూర్తిగా సహకరించానని చెప్పుకొచ్చారు. సమాజంలో తానెంతో బాధ్యత కలిగిన వ్యక్తినని, పోలీసులు, మీడియా అంటే తనకెంతో ఇష్టమని పూరీ వెల్లడించారు. పోలీసులపై తాను ఎన్నో సినిమాలు తీశానని, జర్నలిస్టుల కోసం ఇజం సినిమా తీశానని చెప్పారు.
 
కానీ, మీడియా తన విషయంలో ప్రవర్తించిన తీరు తీవ్ర ఆవేదనకు గురి చేస్తోందన్నారు. మీడియా రేటింగ్స్ కోసం కట్టు కథలు అల్లి ప్రోగ్రామ్స్ చేసిందని.. వాటి వల్ల తన కుటుంబం బాధతో కుమిలిపోతోందని వాపోయారు. ఈ విషయంలో తాను కూడా ఎంతో బాధపడుతున్నట్లు తెలిపారు. నిజంగా చెప్పాలంటే మీడియా జీవితాలను నాశనం చేసిందని పూరీ ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా చేసిన పని వల్ల తాను మాత్రమే కాదని, ఎంతోమంది జీవితాలు నాశనమయ్యాయని పూరీ చెప్పుకొచ్చారు. 
 
పైగా, తప్పుడు పనులను తాను ప్రోత్సహించనని పూరీ జగన్నాథ్ అన్నారు. కెల్విన్‌ గ్యాంగ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. నాపై ఉన్న ఆరోపణలకు సరైన సమాధానం ఇచ్చినట్టు తెలిపారు. సిట్‌ అధికారులు ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరవుతానని పూరీ జగన్నాథ్ తెలిపారు. ఆయన మాటల్లోనే చూడండి ఈ వీడియోను...
అన్నీ చూడండి

తాజా వార్తలు

మాజీ ప్రేమికుడి వేధింపులు.. ప్రైవేట్ ఫోటోలు లీక్.. పెళ్లి క్యాన్సిల్.. ఎలా జరిగిందంటే?

బిల్లు తీసుకురాకపోతే పార్లమెంట్ భవనాన్ని వక్ఫ్ ఆస్తిగా చెబుతారు : కిరణ్ రిజిజు

తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు

కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి వేలం.. జోక్యం చేసుకున్న కేంద్రం.. ఏం చెప్పిందంటే?

హెచ్‌సీయూలో ఏప్రిల్ 3 వరకు పనులు ఆపండి.. తెలంగాణ హైకోర్టు ఆదేశం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

తర్వాతి కథనం
Show comments