Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్ డ్రగ్స్ కేసు: 12 మంది టాలీవుడ్ సెలబ్రిటీస్‌ గుండెల్లో రైళ్లు

Webdunia
శుక్రవారం, 27 ఆగస్టు 2021 (13:59 IST)
సరిగ్గా నాలుగేళ్లకి ముందు టాలీవుడ్‌ని అతలాకుతలం చేసిన డ్రగ్స్ కేసు మళ్లీ ఇప్పుడు తెరమీదకి వచ్చింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈసారి ఏకంగా 12 మంది టాలీవుడ్ సెలబ్రిటీస్‌కి డ్రగ్స్‌తో సంబంధం ఉందని అని అనుమానం వ్యక్తం చేసింది. 
 
ఈ నేపథ్యంలో ఆగస్టు 31న ఈడి టాలీవుడ్ లోని టాప్ డైరెక్టర్ అయిన పూరి జగన్నాథ్ ఇన్వెస్టిగేషన్లో జాయిన్ అవమని పిలుపునిచ్చింది. తాజాగా ఇప్పుడు స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, మాస్ మహారాజా రవితేజ, హీరోయిన్‌గా తప్పుకుని ప్రొడక్షన్లో సెటిలైన ఛార్మి కౌర్, నవదీప్, ముమైత్ ఖాన్, తనీష్, తరుణ్, నందులకు పిలుపునిచ్చింది.
 
ఇక ఈ సెలబ్రిటీల పైన ఇన్వెస్టిగేషన్ సెప్టెంబర్ 2 నుంచి సెప్టెంబర్ 22 వరకు జరుగుతుంది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారికి ఇన్వెస్టిగేషన్లను చేపట్టామని ఇప్పటికే ఆర్డర్ వేసింది ఈడి. కానీ ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్, సెలబ్రిటీలకి వ్యతిరేకంగా ఆధారాలు లేకపోవడం వల్ల పూర్తి చేయలేకపోయింది. 
 
ఈ నేపథ్యంలో మాట్లాడుతూ ఒక అధికారి ఇప్పటికే 11 చార్జిషీట్లు ఫైల్ అయ్యాయని, ఇన్వెస్టిగేషన్ కోసం ఎనిమిది మంది ఇంచార్జిలను నియమించామని, కానీ వారంతా లోయర్ లెవెల్ ట్రాఫికర్లు మాత్రమే అని అన్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 6న రకుల్, సెప్టెంబర్ 8న రానా దగ్గుబాటి, సెప్టెంబర్ 9న రవితేజ మరియు తదితరులు ఇన్వెస్టిగేషన్లో పాల్గొననున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భార్యను ఆమె ప్రియుడికిచ్చి ఎందుకు పెళ్లి చేశానంటే... వివరించిన భర్త (Video)

నా కూతురినే ప్రేమిస్తావా? చావు: గొడ్డలితో నరికి చంపిన వ్యక్తి

అందాల పోటీలు నిలిపివేసి.. అమ్మాయిలకు స్కూటీలు ఇవ్వాలన్న కేటీఆర్!!

పెరుగన్నంలో విషం కలిపి కన్నబిడ్డలకు పెట్టింది.. ఆపై తానూ ఆరగించింది (Video)

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి సీఐడీ కోర్టులో ఎదురుదెబ్బ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments