Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రగ్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్‌కు ఎన్సీబీ సమన్లు??

Webdunia
సోమవారం, 21 సెప్టెంబరు 2020 (15:37 IST)
బావీవుడ్ మూవీ ఇండస్ట్రీలో వెలుగు చూసిన డ్రగ్స్ కేసులో బాలీవుడ్ నటీమణులతో పాటు.. తెలుగు హీరోయిన్‌కు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సమన్లు జారీచేసే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ హీరో సుశాంత్ ఆత్మహత్య కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టిన తర్వాత డ్రగ్స్ కోణం వెలుగు చూసిన విషయం తెల్సిందే. 
 
దీంతో రంగంలోకి దిగిన ఎన్సీబీ సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి వద్ద విచారణ జరుపగా అసలు విషయం బహిర్గతం చేసింది. ముఖ్యంగా, డ్రగ్స్ వాడే పలువురు బాలీవుడ్ సెలెబ్రిటీల పేర్లను కూడా ఆమె చెప్పినట్టు వార్తలు వచ్చాయి. ఇలాంటి వారిలో బాలీవుడ్ హీరోయిన్లు సారా అలీఖాన్, శ్రద్ధా కపూర్, రకుల్ ప్రీత్ సింగ్‌తో పాటు ఫ్యాషన్ డిజైనర్ సైమన్ కంబట్టల పేలు లీక్ అయ్యాయి. 
 
దీంతో వీరందరికీ ఎన్డీపీసీ సెక్షన్ 67 ప్రకారం సమన్లు జారీ చేసి విచారణకు రావాల్సిందిగా ఎన్సీబీ కోరే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సమన్లను కూడా సోమవారం లేదా మంగళవారాల్లో పంపించే అవకాశం ఉన్నట్టు సమాచారం. కాగా, డ్రగ్స్ కేసులో తన పేరు ఉన్నట్టు వస్తున్న కథనాలు ఆపాలంటా రకుల్ ప్రీత్ సింగ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెల్సిందే. ఈ సందర్భంగా ఆమె తనకు ఎలాంటి మాదకద్రవ్యాలు లేదా మద్యం సేవించే అలవాటు లేదని అఫిడవిట్ సమర్పించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తండ్రికి బైక్ గిఫ్టుగా ఇచ్చేందుకు వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిన టెక్కీ

బైకుపై వెళుతున్న దంపతులు.. నిర్మానుష్య ప్రాంతానికి చేరుకోగానే....

ఉగ్రదాడికి పాల్పడిన వారికి.. కుట్రదారులకు కఠిన శిక్ష తప్పదు : ప్రధాని మోడీ హెచ్చరిక

'లొంగిపో బిడ్డా... అందరం ప్రశాంతంగా బతుకుదాం' : ఉగ్రవాది కొడుక్కి తల్లి పిలుపు

భారత్‌పై దాడికి వందల కొద్దీ అణుబాంబులు సిద్ధంగా ఉన్నాయ్ : పాక్ మంత్రి హెచ్చరికలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments