తెలుగులో వర్మ శిష్యుడు వంశీకృష్ణ రూపొందిన దొంగాట చిత్రం గుర్తుండే వుంటుంది. అందులో లక్ష్మీమంచు చిత్రమైన పాత్రను పోషించింది. ఆ చిత్రానికి ఆమె నిర్మాత. అయితే ఈ చిత్రం విడుదలై చాలా కాలమైంది. కాగా, ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయడానికి లక్ష్మీమంచు నుంచి రైట్స్ను తీసుకునేందుకు బాలీవుడ్ నిర్మాత ఒకరు సంప్రదింపులు జరుపుతున్నారు. త్వరలో కొలిక్కి రానుంది.
అయితే ఇందులో లక్ష్మీమంచు పోషించిన పాత్రకు కత్రినా చేయడానికి సిగ్నల్ ఇచ్చిందని తెలిసింది. కానీ, తానే అందులో నటిస్తే ఎలా వుంటుందనే ఆలోచనగా కూడా వచ్చింది. వంశీకృష్ణ ఈ విషయమే ఆమెతో అన్నట్లు తెలిసింది. కానీ బాలీవుడ్ మార్కెట్ దృష్ట్యా కత్రినానే కరెక్ట్ అనే అభిప్రాయానికి లక్ష్మీ వచ్చినట్లు సమాచారం. త్వరలో మరిన్ని వివరాలు తెలియనున్నాయి.