Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్ దర్శకుడు తేజ‌కు కరోనా వైరస్ (Video)

Webdunia
సోమవారం, 3 ఆగస్టు 2020 (15:29 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో మరో దర్శకుడు కరోనా వైరస్ బారినపడ్డారు. ఇటీవలే అగ్రశ్రేణి దర్శకుడు రాజమౌళి కరోనా బారినపడగా, తాజాగా డైరెక్టర్ తేజ కూడా కరోనా బాధితుల్లో ఒకరయ్యారు. ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది.
 
తేజ గతవారం ఓ వెబ్ సిరీస్ షూటింగులో పాల్గొన్నారు. ఆయనకు కరోనా సోకిన నేపథ్యంలో కుటుంబ సభ్యులకు, యూనిట్ సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే అందరికీ కరోనా నెగెటివ్ వచ్చింది. తేజ ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. 
 
ఇదిలావుంటే, తెరాస నేత, కరీంనగర్‌కు చెందిన ఎమ్మెల్సీ నారదాసు లక్షణ్ రావు, ఆయన కుటుంబ సభ్యులు కరోనా బారినపడ్డారు. లక్ష్మణ్ డ్రైవర్, ఇద్దరు గన్‌మన్లు, ఇంట్లోని పనివారికి కూడా కరోనా సంక్రమించినట్టు నిర్ధారణ అయింది. మొత్తం 8 మందికి కరోనా సోకినట్టు తేలింది. 
 
ప్రస్తుతం నారదాసు కుటుంబం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. కాగా, టీఆర్ఎస్‌కే చెందిన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి కూడా నిన్న కరోనా బారినపడ్డారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విక్రయానికి బ్రిటిష్ ఎఫ్-35 బి : ఓఎల్ఎక్స్‌లో సేల్స్ పోస్టర్ వైరల్

డబ్బు కోసం సొంత నగ్న వీడియోల స్ట్రీమింగ్ చేస్తున్న జంట.. ఎక్కడ?

విమానం ఇంజిన్‌లో మంటలు... టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే...

మాట మార్చిన డోనాల్డ్ ట్రంప్ - ఇరాన్ - ఇజ్రాయెల్ దేశాల మధ్య మళ్లీ యుద్ధం!!

Divvela Madhuri: ఎక్కడ.. ఎక్కడ.. ఉందో తారక.. లంగా వోణిలో దివ్వెల మాధురి.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటతో ఆరోగ్యం, అందం

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

తర్వాతి కథనం
Show comments