Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

ఠాగూర్
సోమవారం, 19 మే 2025 (23:45 IST)
తాను ఒక అద్భుతమైన చిత్రాన్ని చూశానని, ఎవరు కూడా మిస్ కావొద్దంటూ ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ట్వీట్ చేశారు. తమిళ హీరో శశికుమార్, సిమ్రాన్ జంటగా నటించిన చిత్రం "టూరిస్ట్ ఫ్యామిలీ". ఈ నెల ఒకటో తేదీన విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని రాజమౌళి తాజాగా చూసి తన స్పందనను తెలియజేశారు. ఈ సినిమా తనకు గొప్ప అనుభూతినిచ్చిందని, ఇటీవలి కాలంలో తాను చూసిన అత్యుత్తమ చిత్రాల్లో ఇదొకటని కొనియాడారు. 
 
'టూరిస్ట్ ఫ్యామిలీ' అనే అద్భుతమైన సినిమాను చూశాను. ఈ చిత్రం తనను ఎంతగానో ఆకట్టుకుంది. మనసును హత్తుకోవడమేకాకుండా కడుపుబ్బా నవ్వించే హాస్యంతో ఉంది. కథనం మొదటి నుంచి చివరి వరకు ఎంతో ఆసక్తికరంగా సాగుతూ ప్రేక్షకులను లీనం చేస్తుందని వివరించారు. 
 
చిత్ర దర్శకుడు అభిషన్ జీవింత్ రచన, దర్శకత్వం చాలా గొప్పగా ఉంది అంటూ పనితీరును మెచ్చుకున్నారు. ఇలాంటి ఒక మంచి సినిమాను అందించినందుకు చిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవలి సంవత్సరాలలో ఇది నాకు ఉత్తమ సినిమాటిక్ అనుభూతిని అందించింది అని రాజమౌళి వ్యాఖ్యానించారు. ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ తప్పక చూడాలని ఎవరూ మిస్ చేసుకోవద్దని ఆయన ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గూఢచర్య నెట్‌వర్క్‌పై ఉక్కుపాదం.. ఇప్పటికే 12 మంది అరెస్టు

భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా 164 నమోదు

Selfi: ఎంత ధైర్యం.. ఆడ చిరుతలతో సెల్ఫీలు వీడియో తీసుకున్నాడా? (video)

బైటకు రావద్దు తలాహ్ సయీద్, నిన్నూ లేపేయొచ్చు: పాక్ ఆర్మీ, ఐఎస్ఐ వార్నింగ్

China: సింధు జలాల నిలిపివేత.. పాకిస్థాన్‌లో ఆ పనులను మొదలెట్టిన చైనా.. ఏంటది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments