Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరోయిన్ ఇంట్లో ఏకంగా పది మందికి కరోనా వైరస్

Webdunia
గురువారం, 20 మే 2021 (13:18 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఉంది. ఈ వైరస్ దెబ్బకు సినీ, క్రీడా, రాజకీయ ప్ర‌ముఖుల‌ని వ‌ణికిస్తుంది. ముఖ్యమంత్రులు కూడా క‌రోనా బారిన ప‌డుతున్నారంటే ఈ సారి క‌రోనా ఉదృతి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. 
 
తాజాగా ఓ హీరోయిన్ ఇంట్లో క‌రోనా క‌ల‌కలం సృష్టించింది. ఒక‌రు ఇద్ద‌రు కాదు ఏకంగా ప‌ది మంది క‌రోనా బారిన ప‌డ్డార‌ట. ఈ విష‌యాన్ని ఆ హీరోయిన్ త‌న సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించింది. గల్ఫ్, యురే, కా అధినేత్రి, గద్దల కొండ గణేష్ చిత్రాల్లో నటించిన బ్యూటీ డింపుల్ హయతి. 
 
తాజాగా ర‌వితేజ హీరోగ తెర‌కెక్కుతున్న 'ఖిలాడి' చిత్ర షూటింగ్‌లో పాల్గొంటుంది. ఈమె స్వ‌స్థ‌లం త‌మిళ‌నాడు కాగా, షూటింగ్ కోసం హైద‌రాబాద్‌కు వ‌చ్చింది. ఈమె ఇక్క‌డికి వ‌చ్చిన‌ప్పుడు త‌మిళ‌నాడులో లాక్‌డౌన్ ప్ర‌క‌టించ‌డంతో ఇక్కడే ఇరుక్కుపోయింది. 
 
తమది పెద్ద ఉమ్మడి కుటుంబం అని చెప్పిన హీరోయిన్.. వారిలో 10 మందిని మహమ్మారి చుట్టుముట్టిందని తెలిపింది. ఇందులో వాళ్ల తాతగారు తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపింది. ఇలాంటి ప‌రిస్థితుల‌లో వారికి దూరంగా ఉండ‌డం,వారి ఆరోగ్య ప‌రిస్థితిని త‌ల‌చుకుంటే బాధ క‌లుగుతుంద‌ని వాపోయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాయచూర్ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి పర్యావరణ ఆమోదం

మాజీ ప్రేమికుడి వేధింపులు.. ప్రైవేట్ ఫోటోలు లీక్.. పెళ్లి క్యాన్సిల్.. ఎలా జరిగిందంటే?

బిల్లు తీసుకురాకపోతే పార్లమెంట్ భవనాన్ని వక్ఫ్ ఆస్తిగా చెబుతారు : కిరణ్ రిజిజు

తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు

కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి వేలం.. జోక్యం చేసుకున్న కేంద్రం.. ఏం చెప్పిందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments