మేఘా ఆకాశ్‌కు సూపర్ ఛాన్స్.. నీదీ నాదీ ఒకటే లోకం అంటూ రాజ్‌తరుణ్‌తో..?

Webdunia
బుధవారం, 20 మార్చి 2019 (12:49 IST)
మేఘా ఆకాశ్ సూపర్ ఛాన్స్ కొట్టేసింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు .. దర్శకుడు కృష్ణారెడ్డితో ఒక సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ దర్శకుడు ఇంతకుముందు 'ఆడు మగాడ్రా బుజ్జీ' సినిమా చేశాడు. రాజ్ తరుణ్‌ను కథానాయకుడిగా ఎంచుకున్న దిల్ రాజు .. కథానాయికగా మేఘా ఆకాశ్‌ను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. 'నీదీ నాదీ ఒకటే లోకం' పేరుతో త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. 
 
ప్రస్తుతం ఈ సినిమాపైనే మేఘా ఆకాశ్‌ ఆశలు పెట్టుకుంది. కాగా 'లై' సినిమా ద్వారా మేఘా ఆకాశ్ తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమా తరువాత మళ్లీ నితిన్ జోడీ కడుతూ 'ఛల్ మోహన్ రంగా' చేసింది. కానీ ఈ రెండు సినిమాలు ఫట్ అయ్యాయి. దాంతో ఈ అమ్మాయికి ఇక్కడ అవకాశాలు ముఖం చాటేశాయి. అందరిలానే తాను కూడా తమిళ చిత్రపరిశ్రమకి వెళ్లి అక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. 
 
ఇప్పటికే అత్తారింటికి దారేదీ తమిళ రీమేక్‌లో మేఘా ఆకాశ్ నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు. దీంతో దిల్ రాజు నిర్మించే తాజా సినిమా కోసం మేఘా ఆకాశ్ కసరత్తులు మొదలెట్టింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్తాన్ కొత్త చట్టం: పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ మారణహోమం చేసినా జీవితాంతం అరెస్ట్ చేయరట

అచ్యుతమ్ కేశవమ్, అలీనగర్‌లో ఆర్జేడీకి షాకిచ్చిన మైథిలీ ఠాకూర్, ఆమె ఎవరు?

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు : కేంద్ర మాజీ మంత్రిపై బీజేపీ సస్పెండ్

న్యాయం చేయాలంటూ డిఐజిని కలిసేందుకు పరుగులు తీసిన అత్యాచార బాధితురాలు (video)

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు : ఖాతా తెరిచిన బీఎస్పీ.. అదీ కూడా 30 ఓట్ల మెజార్టీతో..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments