Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిల్ రాజు ఆఫీస్ మార్చేసాడా..?

Webdunia
శుక్రవారం, 18 సెప్టెంబరు 2020 (13:05 IST)
టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో వకీల్ సాబ్ అనే సినిమా చేస్తున్నారు. సమ్మర్లో రావాల్సిన వకీల్ సాబ్ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ఇదిలా ఉంటే... దిల్ రాజు ఆఫీస్ మార్చనున్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు దిల్ రాజు సడన్‌గా ఆఫీస్ మార్చడం ఏంటి అనుకుంటున్నారా..?
 
ఇంతకీ మేటర్ ఏంటంటే... దిల్ రాజు ఎఫ్ 3 మూవీని ప్లాన్ చేస్తున్నారు. ఎఫ్ 2 మూవీకి సీక్వెల్‌గా రూపొందే ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్, మెగా హీరో వరుణ్ తేజ్ నటించనున్నారు.
 
 సక్సస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించే ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. అయితే.. ఈ మూవీ కోసం దిల్ రాజు హైదరాబాద్ లోని శ్రీనగర్ కాలనీలో కొత్త ఆఫీస్ తీసుకున్నారట.
 
ఈ విషయం తెలిసి దిల్ రాజు ఆఫీస్ మార్చారనుకుంటున్నారు. వెంకీ నారప్ప మూవీ చేస్తున్నారు. వరుణ్ తేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో సినిమా చేస్తున్నారు. ఈ హీరోలిద్దరూ ఈ సినిమా షూటింగ్స్ పూర్తి చేసిన తర్వాత ఎఫ్ 3 షూటింగ్ స్టార్ట్ చేస్తారు. తాజా సమాచారం ప్రకారం.. ఈ ఇయర్ ఎండింగ్‌లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. 2021 సమ్మర్లో ఎఫ్ 3 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎఫ్ 2తో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన వెంకీ, వరుణ్ ఎఫ్ 3తో ఏ స్ధాయి విజయాన్ని సాధిస్తారో చూడాలి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యాభర్తల మధ్య గొడవ.. మద్యం మత్తులో కుమార్తె గొంతుకోసి...

యాంకర్ స్వేచ్ఛతో సన్నిహిత సంబంధం నిజమే... : పూర్ణచందర్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం : సీఎం చంద్రబాబు

పుల్లెల గోపీచంద్ అకాడమీలో తమ సరికొత్త క్లినిక్‌ను ప్రారంభించిన వెల్నెస్ కో

ప్రియురాలుని బైక్ ట్యాంక్ పైన పడుకోబెట్టి వేగంగా నడుపుతూ యువకుడు రొమాన్స్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments