Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీఎఫ్‌డీసీ చైర్మన్‌గా దిల్ రాజు - రెండేళ్ల పదవీకాలం

ఠాగూర్
శనివారం, 7 డిశెంబరు 2024 (09:07 IST)
తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి ఉత్తర్వులు జారీచేసింది. ఆయన ఆ పదవిలో రెండేళ్లపాటు కొనసాగుతారు. గత ఎన్నికల్లో దిల్ రాజు కాంగ్రెస్ తరపున ఎంపీ లేదా ఎమ్మెల్యేగా పోటీ చేస్తారంటూ జోరుగా ప్రచారం జరిగింది. కానీ, ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు. తెర వెనుక ఆయన కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చినట్టు టాక్. ఇపుడు కాంగ్రెస్ ప్రభుత్వం అదికారంలో ఉండటంతో ఆయన టీఎఫ్‌డీసీ చైర్మన్ పదవి వరించింది. 
 
'పుష్ప-2' మూవీ.. వైల్డ్ ఫైర్ కాదు.. వరల్డ్ ఫైర్!! 
 
Allu Arjun Starrer Makes History  అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన తాజా చిత్రం "పుష్ప-2". ఈ చిత్రం గురువారం ప్రపంచ వ్యాప్తంగా ఆరు భాషల్లో విడుదలైంది. ఈ సినిమా విడుదలైన తొలి రోజునే చరిత్ర సృష్టించింది. తొలి రోజున ఏకంగా రూ.294 కోట్ల మేరకు కలెక్షన్లను రాబట్టింది. అలాగే, హిందీ సినిమా రికార్డులను కూడా ఓ చూపు చూసింది. ఫలితంగా 'పుష్ప వైల్డ్ ఫైర్ కాదనీ.. వరల్డ్ ఫైర్' అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ వస్తున్నాయి. 
 
నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేసిన ప్రకటన మేరకు.. 'పుష్ప-2' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.294 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు పేర్కొంది. భారత సినీ చరిత్రలో ఇంత వరకు ఏ సినిమాకూ ఈ స్థాయిలో ఓపెనింగ్ కలెక్షన్లు రాలేదు. 2022లో రాజమౌళి దర్శకత్వం వహించిన మాగ్నమ్ ఓపస్ "ఆర్ఆర్ఆర్" సినిమా కూడా తొలి రోజున రూ.233కోట్లు వసూలు చేయగా, ఆ రికార్డును ఇపుడు 'పుష్ప-2' అధికమించింది. 
 
ఇక హిందీ విషయానికి వస్తే అక్కడ కూడా రూ.72 కోట్లు కొల్లగొట్టింది. తద్వారా సరికొత్త రికార్డును సెట్ చేసింది. ఇప్పటివరకు ఏ హిందీ చిత్రం కూడా మొదటిరోజు ఈ స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేదు. బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ నటించిన 'జవాన్' చిత్రం హిందీ వెర్షన్ తొలి రోజున రూ.65.5 కోట్లు రాబట్టగా, ఇపుడు 'పుష్ప' దెబ్బకు రెండో స్థానానికి 'జవాన్' పడిపోయింది. అలాగే, తెలంగాణాలోని నైజాం ఏరియాలో తొలి రోజున రూ.30 కోట్లు వసూలు చేయగా, దాంతో నైజాలో 'ఆర్ఆర్ఆర్' సాధించిన రూ.23కోట్ల రికార్డు కనుమరుగైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bengaluru: స్నేహితుడి భార్యతో అక్రమ సంబంధం.. చివరికి భార్య, స్నేహితుడి చేతిలోనే?

యూఎస్ వీసా దొరకలేదు.. మనస్తాపంతో జగిత్యాలలో 25 ఏళ్ల మహిళ ఆత్మహత్య

బుడమేరు వరద వార్తలను నమ్మొద్దు, వెలగలేరు గేట్లు తెరవలేదు: ఎన్టీఆర్ కలెక్టర్ (video)

సెప్టెంబర్ చివరి వారంలో అమెరికాలో సందర్శించనున్న ప్రధాని మోదీ

Kerala man: భార్య ఉద్యోగం కోసం ఇంటిని వదిలి వెళ్లిపోయింది.. భర్త ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments