Webdunia - Bharat's app for daily news and videos

Install App

పడుచు అమ్మాయిలపైనే దర్శకులు చూపు : దియా మీర్జా

బాలీవుడ్ నటి దియా మీర్జా సంచలన వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్ ఖల్‌నాయక్ సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం "సంజు". ఈ చిత్రం ఈనెలాఖరులో విడుదల కానుంది. ఈ చిత్రం ద్వారా దియా మీర్జా రీ ఎంట్రీ ఇస్త

Webdunia
ఆదివారం, 24 జూన్ 2018 (12:39 IST)
బాలీవుడ్ నటి దియా మీర్జా సంచలన వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్ ఖల్‌నాయక్ సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం "సంజు". ఈ చిత్రం ఈనెలాఖరులో విడుదల కానుంది. ఈ చిత్రం ద్వారా దియా మీర్జా రీ ఎంట్రీ ఇస్తోంది. ఇందులో సంజయ్ దత్ భార్య మాన్యతా దత్ పాత్రలో దియా మీర్జా కనిపించనుంది. ఈ నేపథ్యంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ప్రస్తుత దర్శక నిర్మాతల చూపంతా యంగ్ హీరోయిన్లపైనే ఉందని వ్యాఖ్యానించింది.
 
ముఖ్యంగా, కథానాయికలు నటపరంగా ఎంతో ఆకట్టుకున్నా కూడా ఆ హీరోయిన్ వయసు 30 దాటిందంటే చాలు అవకాశం ఇవ్వడానికి ఏ డైరెక్టర్ ముందుకు రావటం లేదని వాపోయింది. ప్రధానంగా దర్శకనిర్మాతల చూపంతా పడుచు అమ్మాయిలపైనే కేంద్రీకృతమైవుందని అభిప్రాయపడింది. 
 
తమ సినిమాల్లో నటించేందుకు వారికే అవకాశం ఇస్తున్నారే.. తప్ప సీనియర్ హీరోయిన్ వైపు చూడటం లేదు. కాస్త వయసు పైబడినంత మాత్రాన నటనకు పనికిరామా? అంటూ తన ఆవేదన వెళ్లబుచ్చుతూనే.. రానురాను సినిమా రంగంలో మార్పులు గమనిస్తున్నాం.. మరి హీరోయిన్స్ పర్సనల్ లైఫ్‌లో మార్పులు రాకూడదా? అని ఆమె ప్రశ్నిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments