Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓటీటీలోకి వస్తోన్న తిరు.. ధనుష్‌ క్రేజ్ ఏమాత్రం తగ్గదట..

Webdunia
శుక్రవారం, 23 సెప్టెంబరు 2022 (17:35 IST)
కొలవెరి ఫేమ్ ధనుష్ నటించిన "తిరుచిట్రంబలం" మూవీ తిరు పేరుతో తెలుగులో రిలీజైంది. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ మంచి కలెక్షన్లను సాధించి బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. 
 
ఈ సినిమాతో ధనుష్‌కు తెలుగులో మంచి మార్కెట్‌ ఏర్పడింది. అంతేకాకుండా ధనుష్‌కు వంద కోట్ల కలెక్షన్లను సాధించిన మొదటి సినిమాగా ఈ చిత్రం నిలిచింది. 
 
ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో విడుదల కానుంది. ఈ చిత్రం గత రాత్రి నుండి ‘సన్‌ ఎన్‌ఎక్స్‌టీ’లో స్ట్రీమింగ్‌ అవుతుంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్‌ అవుతుంది. 
 
ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించాడు. ధనుష్‌కు జోడీగా రాశీఖన్నా, నిత్యామీనన్‌, ప్రియా భవాని శంకర్‌లు హీరోయిన్‌లుగా నటించారు. ప్రముఖ దర్శకుడు భారతీరాజా కీలకపాత్రలో నటించాడు. మ్యూజిక్ సెన్సేషన్ అనురుధ్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు.
 
ప్రస్తుతం ధనుష్ నటించిన 'నానే వరువెన్' విడుదలకు సిద్ధంగా ఉంది. సెల్వా రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రాన్ని తెలుగులో ‘నేనే వస్తున్నా’ పేరుతో గీతా ఆర్స్ట్‌ బ్యానర్‌పై అల్లు అరవింద్‌ విడుదల చేస్తున్నాడు. దీనితో పాటుగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న 'సార్' డిసెంబర్ 2న విడుదల కానుంది. ‘రంగ్‌దే’ ఫేం వెంకీ అట్లూరీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతి వేశ్యల రాజధాని అంటూ కామెంట్స్... మహిళా కమిషన్ సీరియస్

మహిళా జడ్జి మంగళసూత్రం మాయం.. లేడీ గ్యాంగ్‌స్టర్ అరెస్టు

మాగంటి గోపీనాథ్ భౌతికకాయం : మాజీ సీఎం కేసీఆర్ కంటతడి

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ - కొత్తగా ముగ్గురుకి చోటు

కొడుకా... రూ.100 కోట్లు రాసిపెట్టాను.. లేవరా.... (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments