Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓటీటీలోకి వస్తోన్న తిరు.. ధనుష్‌ క్రేజ్ ఏమాత్రం తగ్గదట..

Webdunia
శుక్రవారం, 23 సెప్టెంబరు 2022 (17:35 IST)
కొలవెరి ఫేమ్ ధనుష్ నటించిన "తిరుచిట్రంబలం" మూవీ తిరు పేరుతో తెలుగులో రిలీజైంది. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ మంచి కలెక్షన్లను సాధించి బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. 
 
ఈ సినిమాతో ధనుష్‌కు తెలుగులో మంచి మార్కెట్‌ ఏర్పడింది. అంతేకాకుండా ధనుష్‌కు వంద కోట్ల కలెక్షన్లను సాధించిన మొదటి సినిమాగా ఈ చిత్రం నిలిచింది. 
 
ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో విడుదల కానుంది. ఈ చిత్రం గత రాత్రి నుండి ‘సన్‌ ఎన్‌ఎక్స్‌టీ’లో స్ట్రీమింగ్‌ అవుతుంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్‌ అవుతుంది. 
 
ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించాడు. ధనుష్‌కు జోడీగా రాశీఖన్నా, నిత్యామీనన్‌, ప్రియా భవాని శంకర్‌లు హీరోయిన్‌లుగా నటించారు. ప్రముఖ దర్శకుడు భారతీరాజా కీలకపాత్రలో నటించాడు. మ్యూజిక్ సెన్సేషన్ అనురుధ్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు.
 
ప్రస్తుతం ధనుష్ నటించిన 'నానే వరువెన్' విడుదలకు సిద్ధంగా ఉంది. సెల్వా రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రాన్ని తెలుగులో ‘నేనే వస్తున్నా’ పేరుతో గీతా ఆర్స్ట్‌ బ్యానర్‌పై అల్లు అరవింద్‌ విడుదల చేస్తున్నాడు. దీనితో పాటుగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న 'సార్' డిసెంబర్ 2న విడుదల కానుంది. ‘రంగ్‌దే’ ఫేం వెంకీ అట్లూరీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

సంబంధిత వార్తలు

ఏపీలో పోలింగ్ తర్వాత హింస : సీఎస్‌పై ఈసీ ఆగ్రహం... ఓట్ల లెక్కింపు తర్వాత కూడా భద్రత కొనసాగింపు..

చిన్నారి చేతి వేలికి ఆపరేషన్ చేయమంటే.. నాలుకకు చేసిన వైద్యుడు... ఎక్కడ?

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments