Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లల కోసం ఒక్కటయ్యారు... ఒకే చోట ధనుష్ - ఐశ్వర్య

Webdunia
మంగళవారం, 23 ఆగస్టు 2022 (10:29 IST)
తల్లిదండ్రులు ఎవరైనా జీవించేది తమ సంతానం కోసమే. చాలా మంది దంపతులు విడాకులు తీసుకున్నప్పటికీ తమ పిల్లల జీవితాల్లో జరిగే సంతోషకరమైన రోజున ఒక్కటిగా కలుస్తుంటారు. అదేవిధంగానే ఇపుడు కోలీవుడ్ హీరో ధనుష్, ఆయన మాజీ భార్య ఐశ్వర్య రజనీకాంత్ కలిశారు. వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నట్టు అధికారికంగా ప్రకటించిన తర్వాత వారిద్దరూ ఒకే వేదికపై కనిపించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 
 
ధనుష్ - ఐశ్వర్య దంపతుల పెద్ద కుమారుడు యాత్ర తాను చదివే స్కూల్‌లో స్పోర్ట్స్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ధనుష్, ఐశ్వర్య దంపతులు హాజరయ్యారు. భార్యాభర్తలుగా విడిపోయినప్పటికీ తమ పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని, వారికి మంచి తల్లిదండ్రులుగా ఉండాలనే కోణంలో ఆలోచన చేసి వారిద్దరూ ఒకచోట కలవడం నిజంగానే అభినందనీయం. 
 
తెలుగు చిత్రపరిశ్రమలో కూడా హీరో పవన్ కళ్యాణ్ తన రెండో భార్య, సినీ హీరోయిన్ రేణూ దేశాయ్‌కు విడాకులు ఇచ్చారు. కానీ, వీరిద్దరూ తమ పిల్లల పుట్టినరోజు వేడుకలు, ఇతక శుభకార్యాల్లో కలుసుకుంటున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Breaking News: హైదరాబాద్‌లోని సిటీ సివిల్ కోర్టులో బాంబు బెదిరింపు

లింగ నిర్ధారణ పరీక్షలు.. ఆడపిల్ల అని తెలిస్తే చాలు.. అబార్షన్... వైద్యుడి నిర్వాకం

Ys Jagan: ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ వద్ద జగన్, విజయమ్మ నివాళులు

మహిళతో అర్థనగ్నంగా ప్రవర్తించిన ఎంఎన్‌ఎస్ నేత కుమారుడు

Weather alert: తెలంగాణలో భారీ వర్షాలు.. ఐదు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments