Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధనుష్ - ఐశ్వర్యలకు విడాకులు - చెన్నై కోర్టు తీర్పుతో ముగిసిన వివాహ బంధం

ఠాగూర్
గురువారం, 28 నవంబరు 2024 (12:33 IST)
టాలీవుడ్ హీరో ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్‌ల వివాహ బంధం ముగిసిపోయింది. వీరిద్దరికీ చెన్నై ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టు విడాకులు మంజూరు చేసింది. దీంతో దాదాపు 20 యేళ్ల పాటు సాగిన వైవాహిక బంధం తెగిపోయింది. గత 2004లో వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి వేధ్, లింగా అనే ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో గత 2022లో ఈ జంట విడిపోతున్నట్టు అధికారికంగా ప్రకటించింది. 
 
ఈ నేపథ్యంలో ఆరు నెలల క్రితం తమకు విడాకులు మంజూరు చేయాలని కోరుతూ ధనుష్ చెన్నై ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై పలుమార్లు విచారణ జరిపిన కోర్టు.. కలిసి వుండేందుకు ప్రయత్నించాలని సూచించింది. అయితే, తాము కలిసి జీవించలేమని, అందువల్ల తమకు విడాకులు మంజూరు చేయాలంటూ వారిద్దరూ కోర్టుకు తెలిపారు. ఇరువురి వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి శుభాదేవి వారికి విడాకులు మంజూరు చేస్తూ బుధవారం తుదితీర్పును వెలువరించింది. 
 
అయితే, వారిద్దరినీ కలిపేందుకు, సర్ది చెప్పేందుకు ఇరు కుటుంబాలకు చెందిన సన్నిహితులు ఎంతగానో ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలు ఏవీ ఫలిచంలేదు కదా, ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ ధనుష్, ఐశ్వర్యల వైఖరిలో ఎలాంటి మార్పు కనిపించలేదు. పైగా పరస్పర అంగీకారంతో విడిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్టు వారు కోర్టుకు తెలిపారు. దీంతో న్యాయమూర్తి విడాకులు మంజూరు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా వేలాది మంది భక్తులు కాశ్మీర్ క్షీర్ భవానీ అమ్మవారికి పూజలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments