ధనుష్ - ఐశ్వర్యలకు విడాకులు - చెన్నై కోర్టు తీర్పుతో ముగిసిన వివాహ బంధం

ఠాగూర్
గురువారం, 28 నవంబరు 2024 (12:33 IST)
టాలీవుడ్ హీరో ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్‌ల వివాహ బంధం ముగిసిపోయింది. వీరిద్దరికీ చెన్నై ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టు విడాకులు మంజూరు చేసింది. దీంతో దాదాపు 20 యేళ్ల పాటు సాగిన వైవాహిక బంధం తెగిపోయింది. గత 2004లో వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి వేధ్, లింగా అనే ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో గత 2022లో ఈ జంట విడిపోతున్నట్టు అధికారికంగా ప్రకటించింది. 
 
ఈ నేపథ్యంలో ఆరు నెలల క్రితం తమకు విడాకులు మంజూరు చేయాలని కోరుతూ ధనుష్ చెన్నై ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై పలుమార్లు విచారణ జరిపిన కోర్టు.. కలిసి వుండేందుకు ప్రయత్నించాలని సూచించింది. అయితే, తాము కలిసి జీవించలేమని, అందువల్ల తమకు విడాకులు మంజూరు చేయాలంటూ వారిద్దరూ కోర్టుకు తెలిపారు. ఇరువురి వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి శుభాదేవి వారికి విడాకులు మంజూరు చేస్తూ బుధవారం తుదితీర్పును వెలువరించింది. 
 
అయితే, వారిద్దరినీ కలిపేందుకు, సర్ది చెప్పేందుకు ఇరు కుటుంబాలకు చెందిన సన్నిహితులు ఎంతగానో ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలు ఏవీ ఫలిచంలేదు కదా, ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ ధనుష్, ఐశ్వర్యల వైఖరిలో ఎలాంటి మార్పు కనిపించలేదు. పైగా పరస్పర అంగీకారంతో విడిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్టు వారు కోర్టుకు తెలిపారు. దీంతో న్యాయమూర్తి విడాకులు మంజూరు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. కేసీఆర్ మాజీ ఓఎస్డీ వద్ద విచారణ

Jagan: ఏపీ లిక్కర్ కేసులో జగన్ సన్నిహితుడు నర్రెడ్డి సునీల్ రెడ్డి అరెస్ట్

Fibre Case: ఫైబర్‌నెట్ కేసు.. చంద్రబాబుతో పాటు 16మందిపై కేసు కొట్టివేత

Pawan Kalyan: పీఠాపురంలో 3 ఎకరాల భూమిని కొనుగోలు చేయనున్న పవన్

శ్రీలంక తీరంలో తీవ్ర వాయుగుండం - దిత్వాహ్‌గా నామకరణం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments