Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రముఖ సినీ నటులపై ఢిల్లీ పోలీసుల కేసు.. ఎందుకు?

Webdunia
ఆదివారం, 5 సెప్టెంబరు 2021 (12:11 IST)
'దిశ రేప్​' ఘటనకు సంబంధించి ప్రముఖ సినీనటులపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. అత్యాచార బాధితురాలి పేరును సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేసినందుకుగాను వారిపై ఈ కేసులు నమోదు చేశారు. 
 
గత 2019లో హైదరాబాద్​లో జరిగిన దిశ హత్యాచారానికి సంబంధించి.. ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, టాలీవుడ్ నటుడు రవితేజ, నటి రకుల్​ ప్రీత్ సింగ్​ సహా 38 మందిపై కేసు నమోదైంది. 
 
బాధితురాలి పేరును సామాజిక మాధ్యమాల వేదికగా బహిర్గతం చేసినందుకు ప్రముఖులను అరెస్టు చేయాలని కోరుతూ దిల్లీ తీస్ హజారీ కోర్టులో న్యాయవాది గౌరవ్ గులాటీ పిటిషన్​ దాఖలు చేశారు. 
 
అలాగే, సెక్షన్ 228ఏ కింద ప్రముఖులపై కేసు నమోదు చేయాలని సబ్జీ మండీ పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేశారు గౌరవ్. బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, అజయ్ దేవ్​గన్, అభిషేక్ బచ్చన్, ఫరాన్ అక్తర్, అనుపమ్ ఖేర్ సహా టాలీవుడ్ నటులు రవితేజ, అల్లు శిరీష్, నటి ఛార్మి పేర్లను ఫిర్యాదులో పేర్కొన్నారు గౌరవ్. హర్బజన్ సింగ్, శిఖర్ ధావన్, సైనా నెహ్వాల్ పై కూడా కేసు నమోదు చేయాలని కోరారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హోటల్ గదిలో ప్రాణాలు తీసుకున్న బ్యూటీషియన్... ఎక్కడ?

Delhi murder: బాల్కనీలో ప్రేమికుల గొడవ.. ప్రియురాలిని ఐదో అంతస్థు నుంచి తోసేశాడు..

ప్రియురాలి కోరిక మేరకు ఆమె భర్తను హత్య చేసిన ప్రియుడు...

గోడపై విద్యార్థిని ఫోటో చూస్తూ హస్తప్రయోగం చేసిన ఇంజినీరింగ్ విద్యార్థి, జైలు శిక్ష

3 వేల కార్లతో సముద్రంలో మునిగిపోయిన కార్గో నౌక!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

తర్వాతి కథనం
Show comments