Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్‌కు జోడీగా దీపికా పదుకునే..?

Webdunia
ఆదివారం, 1 మార్చి 2020 (13:14 IST)
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రాధాకృష్ణ దర్శకత్వంలో కొత్త సినిమా రూపుదిద్దుకుంటోంది. పాన్ ఇండియన్ మూవీగా తెరకెక్కనున్న ఈ మూవీలో ప్రభాస్‌కు జోడిగా పూజా హెగ్డే నటిస్తుంది. కాగా ఈ మూవీ సెట్స్‌ఫై ఉండగానే మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ఓ మూవీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మించనున్నారు. 
 
ఈ చిత్రం గురించి నాగ్ అశ్విన్ మాట్లాడుతూ ఇది కేవలం పాన్ ఇండియా సినిమా కాదని, పాన్ వరల్డ్ సినిమా అని అన్నారు. దీన్నిబట్టి చిత్రం ఎంత భారీగా ఉండనుందో అర్థమవుతోంది. ఈ సినిమా కోసం భారీ తారాగణాన్ని తీసుకుంటున్నారు. ముఖ్యంగా హీరోయిన్ రోల్ కోసం ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకునేను తీసుకునే ఆలోచనలో ఉన్నారని టాక్. ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు మొదలైనట్టు ఫిల్మ్ నగర్ టాక్.
 
మరోవైపు ప్రభాస్ చేస్తున్న 'జాన్' చిత్రం పూర్తవగానే కొత్త సినిమా మొదలు కానుంది. మహానటి సినిమా తరహాలో భారీ బడ్జెట్ చిత్రంగా నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు. దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో రూపొందనున్న ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నట్టు సమాచారం.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జూబ్లీహిల్స్‌లో బిస్ట్రోలో డ్రగ్ పార్టీ జరిగిందా?

తండ్రి ఫిర్యాదు ఎఫెక్ట్.. ఠాణాలో తనయుడు ... నిరసన తెలిపిన హీరో (Video)

Delhi: ఢిల్లీ బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరు? మహిళను ముఖ్యమంత్రి చేయనున్నారా?

అమెరికాకు పాకిన బర్డ్ ఫ్లూ.. డజను కోడిగుడ్ల ధర రూ.800పైనే.. చికెన్ ధరలకు రెక్కలు

రూ.15 కోట్లు పెట్టిన ప్యాన్సీ నంబర్ కొన్నాడు... ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments