Webdunia - Bharat's app for daily news and videos

Install App

తీవ్ర విచారంలో పుష్ప 2 నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్

డీవీ
గురువారం, 5 డిశెంబరు 2024 (17:06 IST)
Pushpa2 poster
తాము తీవ్ర విచారంలో వున్నామని పుష్ప 2 నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించారు. కొద్దిసేపటి క్రితమే వారు సోషల్ మీడియాలో స్పందించారు. గత రాత్రి స్క్రీనింగ్ సమయంలో జరిగిన విషాద సంఘటనతో మేము చాలా బాధపడ్డాము. మా ఆలోచనలు, ప్రార్థనలు కుటుంబం  వైద్య చికిత్స పొందుతున్న చిన్న పిల్లవాడితోనే ఉన్నాయి. ఈ క్లిష్ట సమయంలో వారికి అండగా నిలవడానికి మరియు సాధ్యమైన అన్ని సహాయాన్ని అందించడానికి మేము కట్టుబడి ఉన్నాము. అందుకే తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నామని మైత్రి మూవీ మేకర్స్ పేర్కొన్నారు.
 
పుష్ప2 సినిమా రిలీజ్ ముందు రోజు అనగా నిన్న రాత్రి 10గంటలకు హైదరాబాద్ సంథ్య థియేటర్లో అభిమానుల షో వేశారు. ఇందుకు తండోపతండాలుగా ఫ్యాన్స్ హాజరయ్యారు. అయితే అల్లు అర్జున్ వస్తున్నాడు అనగానే పెద్ద ఎత్తున తోపులాట జరగడం, ఓ మహిళ మృతి చెందగా.. ఓ చిన్నారి తీవ్ర గాయాలపాలైంది. ఈ విషయం గురించి తెలుసుకున్న చిత్ర యూనిట్, తాజాగా దీనిపై స్పందించింది. ఇలాంటి ప్రమాదాలకు తావివ్వకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నారా లోకేష్‌కు టీడీపీ నాయకత్వ పగ్గాలు అప్పగిస్తారా? చంద్రబాబు యాన్సర్ ఏంటి?

ఆ నంబర్ వుంటేనే తత్కాల్ టిక్కెట్లు బుకింగ్.. రైల్వే శాఖ

వైట్ కాలర్ ఉద్యోగుల కంటే ఎక్కువ సంపాదిస్తున్న ఆటో డ్రైవర్!!

ఒక ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా అందరికీ రూ.15 వేలు: మంత్రి నారా లోకేశ్

మేఘాలయ హనీమూన్ కేసు: నా సోదరి తప్పు చేసింది, మరణశిక్ష విధించాలి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments