Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీరెడ్డి నుంచి నాకు ప్రాణహాని వుంది: డ్యాన్స్ మాస్టర్ రాకేశ్

Webdunia
శనివారం, 29 ఫిబ్రవరి 2020 (11:42 IST)
సోషల్ మీడియాలో శ్రీరెడ్డి తమపై అసభ్యకర పోస్టులు చేసిందని ఆరోపిస్తూ నటి కల్యాణి, డ్యాన్స్ మాస్టర్ రాకేశ్ ఇటీవల హైదరాబాద్ క్రైం బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రతిగా శ్రీరెడ్డి కూడా కరాటే కల్యాణి, డ్యాన్స్ మాస్టర్ రాకేశ్‌లపై చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
 
ఇది జరిగి మూడు రోజులైనా కాకముందే ఇప్పుడు రాకేశ్ మాస్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు డ్యాన్స్ మాస్టర్ ఎస్. రామారావు అలియాస్ రాకేశ్ (49) బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
సినీ నటి శ్రీరెడ్డి, ఆమె అనుచరుల నుంచి తనకు ప్రాణహాని ఉందని, తనను చంపుతానని యూట్యూబ్, ఫేస్‍‌బుక్ ద్వారా బెదిరిస్తున్నారంటూ రాకేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ గురించి ఓ ఇంటర్వ్యూలో తాను చేసిన వ్యాఖ్యలను ఆయన అభిమానులు అపార్థం చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
అభిమాన సంఘం పేరుతో తనను బెదిరిస్తున్నారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అసభ్య పదజాలంతో వేధిస్తున్నారన్నారు. మూడు రోజుల్లో తనను చంపుతామని మరికొందరు బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఆ పని చేస్తే పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతాం : పాక్ ఆర్మీ చీఫ్ మునీర్

పెళ్లి పల్లకీ ఎక్కాల్సిన వధువు గుండెపోటుతో మృతి

Mock Drills: సివిల్ మాక్ డ్రిల్స్‌పై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన- శత్రువులు దాడి చేస్తే?

ఇదిగో ఇక్కడే వున్నారు పెహల్గాం ఉగ్రవాదులు అంటూ నదిలో దూకేశాడు (video)

పాకిస్థాన్ మద్దతుదారులపై అస్సాం ఉక్కుపాదం : సీఎం హిమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments