Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెంకటేష్ - మీనా "దృశ్యం" మూవీపై క్రేజీ అప్‌డేట్స్

Webdunia
సోమవారం, 20 సెప్టెంబరు 2021 (17:46 IST)
మలయాళంలో సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన చిత్రం 'దృశ్యం'. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్. ఈ మూవీని తెలుగులోకి హీరో వెంకటేష్, మీనా జంటగా రీమేక్ చేశారు. ఇక్కడు కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ మధ్య మళయాళంలో వచ్చిన ఈ సినిమా సీక్వెల్‌కి కూడా అనూహ్యమైన స్పందన లభించింది. దాంతో తెలుగులోనూ ఈ సీక్వెల్‌కి రీమేక్ చేశారు. మళయాంలో ఈ సీక్వెల్‌ని ఓటీటిలో రిలీజ్ చేశారు. 
 
ఫిబ్రవరి 19న అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేరుగా విడుదల చేశారు. అయితే తెలుగులో రీమేక్ అవుతున్న దృశ్యం 2 కూడా ఓటీటీ వేదికగానే విడుదలవుతుందని గత కొద్ది రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌కి చెందిన ఒక ప్రముఖ సంస్థవారు భారీ ఆఫర్ ఇవ్వడంతో నిర్మాతలు అంగీకరించారనీ, అందువలన ఈ సినిమా ఓటీటీ ద్వారానే రానుందనే టాక్ ఊపందుకుంది.
 
దీనిపై నిర్మాత సురేష్ బాబు స్పందించారు. ఇదంతా కేవలం పుకార్లు మాత్రమేనని తేల్చేశారు. ఏ విషయమైనా తామే స్వయంగా చెప్పేవరకూ ప్రచారాలు నమ్మవద్దని హితవు పలికారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నెల వేతనం రూ.15 వేలు.. రూ.34 కోట్ల పన్ను చెల్లించాలంటూ నోటీసులు - ఐటీ శాఖ వింత చర్య!!

నిత్యానంద మృతి వార్తలు - వాస్తవం ఏంటి? కైలాసం నుంచి అధికార ప్రకటన!

రతన్ టాటా ఔదార్యం : తన ఆస్తుల్లో దాతృత్వానికే సింహభాగం

భార్యాభర్తలు కాదని తెలుసుకుని మహిళపై సామూహిక అత్యాచారం...

జీవితంలో నేను కోరుకున్నది సాధించలేకపోయాను- టెక్కీ ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

తర్వాతి కథనం
Show comments