Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజకీయాలు రోత రోత.. ఎన్టీఆర్, వైఎస్సార్ గ్రేట్.. సినీ పరిశ్రమ వల్లే డ్రగ్స్ పెరగలేదు

ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు జంప్ జలానీలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రస్తుత రాజకీయాలు నానాటికీ దిగజారిపోతున్నాయన్నారు. రాజకీయ నాయకుల్లో ఎన్టీఆర్, రాజశేఖరరెడ్డి ఇద్దరూ గొప్ప నాయకులని స

Webdunia
బుధవారం, 16 ఆగస్టు 2017 (10:34 IST)
ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు జంప్ జలానీలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రస్తుత రాజకీయాలు నానాటికీ దిగజారిపోతున్నాయన్నారు. రాజకీయ నాయకుల్లో ఎన్టీఆర్, రాజశేఖరరెడ్డి ఇద్దరూ గొప్ప నాయకులని సురేష్ బాబు తెలిపారు. నిర్ణయాలను అత్యంత వేగంగా తీసుకోవడంలో వీరికి ఎవరూ సాటిరారని కొనియాడారు.  
 
అయితే ప్రస్తుత రాజకీయ నేతలు ప్రజలచే ఎన్నుకొనబడుతున్నామనే విషయాన్ని మరిచి.. పదవి కోసం, అధికారం కోసం ఇతర పార్టీలకు మారిపోతున్నారని ఫైర్ అయ్యారు. ఒక పార్టీ తరపున పోటీచేసి గెలిచాక.. మరో పార్టీ ఆశచూపితే ఆ పార్టీరి జంప్ కావడం ముమ్మాటికీ అధికారాన్ని దుర్వినియోగపరచడమే అవుతుందన్నారు. 
 
జనం పార్టీ మీదో, లేదా రాజకీయ నేతపైనే నమ్మకంతో ఓటేసి గెలిపిస్తే.. ఆ పార్టీకి పనిచేయక పార్టీలు మారడం విలువలను వదులుకోవడమే అవుతుందని సురేష్ బాబు తెలిపారు. నమ్మి ఓటేసిన ఓటర్లను మోసం చేయడం రాజకీయ నాయకులకు అలవాటుగా మారిందని విమర్శించారు. మద్యం, డ్రగ్స్, ధూమపానం సినిమాలు రాకముందు నుంచే ఉన్నాయని... సినీ పరిశ్రమ వల్ల అవి పెరగలేదని చెప్పారు. ఏ రంగానికైనా క్రమశిక్షణ అనేది అవసరమన్నారు..
అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments