Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెప్పిన మాటని పూర్తిగా వినకపోతే వచ్చే స‌మ‌స్యే క్రేజీ ఫెలోః దర్శకుడు ఫణి కృష్ణ

Webdunia
మంగళవారం, 11 అక్టోబరు 2022 (16:06 IST)
director Fani Krishna
ఆది సాయికుమార్‌ కథానాయకుడిగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌లో ఫణి కృష్ణ సిరికి దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ నిర్మించిన యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ క్రేజీ ఫెలో.  దిగంగన సూర్యవంశి, మిర్నా మీనన్ కథానాయికలు. అక్టోబర్ 14న సినిమా విడుదలౌతున్న నేపధ్యం సినిమా దర్శకుడు ఫణి కృష్ణ విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.
 
- దేళ్ళుగా ఇండస్ట్రీలో వున్నాను. షార్ట్ ఫిలిమ్స్, యాడ్ ఫిలిమ్స్ చేశాను. కొన్ని చిన్న సినిమాలకు పని చేశాను. కళ్యాణ్ కృష్ణ గారి దగ్గర రచన విభాగంలో కూడా చేశాను. క్రేజీ ఫెలో కథ రాధమోహన్ గారికి చెప్పాను. ఆయనకి చాలా బాగా నచ్చింది. ఈ సినిమాతో బిగ్ స్క్రీన్ పైకి రావడం అనందంగా వుంది.
 
- క్రేజీ ఫెలో క్యారెక్టర్ బేస్డ్ మూవీ. హీరో పాత్రని చాలా క్రేజీ గా డిజైన్ చేశాం. చెప్పిన మాటని పూర్తిగా వినకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ ని హిలేరియస్ గా చూపించాం. చాలా మంచి వినోదం వుంటుంది. ఎంటర్ టైన్ మెంట్ ఎప్పుడూ వర్క్ అవుట్ అవుతుందని నమ్ముతాను. ఆది గారిని ఫుల్ లెంత్ లవ్ ఎంటర్ టైనర్ లో చూసి చాలా కాలమైయింది. క్రేజీ ఫెలో తప్పకుండా వర్క్ అవుట్ అవుతుందనే నమ్మకం వుంది. ఈ సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు మంచి చిరునవ్వుతో బయటికి వస్తారు.
 
- ఆది ఇందులో కొత్తగా వుంటారు. ఆయన నటన కూడా కొత్తగా వుంటుంది. ఒక కొత్త ఆదిని చూస్తారు. అద్భుతంగా ఫెర్ ఫార్మ్ చేశారు. ఇందులో యాక్షన్ కూడా వుంది. అయితే ఇందులో విలన్ కూడా హీరోనే. అతని వలన అతనికే సమస్యలు( నవ్వుతూ). చాలా ఎంటర్ టైనింగ్ గా వుంటుంది. ఇద్దరు హీరోయిన్ల పాత్రలు కూడా చాలా కీలకంగా వుంటుంది.
 
- మంచి సినిమాకి ప్రేక్షకులు తప్పకుండా థియేటర్ కి వస్తారని నమ్ముతాను. సినిమా బావుందని తెలిస్తే మాత్రం తప్పకుండా  థియేటర్ కి వస్తారు. క్రేజీ ఫెలో మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్. థియేటర్ కి వచ్చిన ప్రేక్షకుడు మంచి సినిమా చుశామనే ఫీలింగ్ తో బయటికి వస్తారు. ఆది గారికి ఖచ్చితంగా విజయం వస్తుందని నమ్ముతున్నాను.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లయిన 15 రోజులకే ముగ్గురు పిల్లల తల్లిని రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తి!

పాకిస్థాన్‌తో సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు : కేంద్రం సంచలన నిర్ణయం!!

Vinay Narwal Last Video: భార్యతో వినయ్ నర్వాల్ చివరి వీడియో- నెట్టింట వైరల్

Sadhguru: ఉగ్రవాదులు కోరుకునేది యుద్ధం కాదు.. ఏదో తెలుసా? ఐక్యత ముఖ్యం: సద్గురు

Pahalgam: పహల్గామ్ ఘటన: పాక్ పౌరులు 48గంటల్లో భారత్‌ నుంచి వెళ్లిపోవాల్సిందే.. కేంద్రం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments