పృథ్వీరాజ్‌తో సహా బ్లెస్సీ యూనిట్.. ఎడారిలో చిక్కుకుపోయింది.. ఆకలితో..?

Webdunia
గురువారం, 2 ఏప్రియల్ 2020 (12:35 IST)
Prithivraj
మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ హీరోగా, బ్లెస్సీ ద‌ర్శ‌క‌త్వంలో 'ఆడు జీవితం' పేరిట ఓ చిత్ర నిర్మాణం మొదలైంది. కథలో భాగంగా సినిమా షూటింగ్‌ను జోర్డాన్ ఎడారిలో జరపాలని భావించారు. అక్క‌డి ప‌రిస్థితులు బాగోలేవ‌ని కొందరు చెప్పినా, చిత్ర యూనిట్ వినకుండా అక్కడికి వెళ్లింది. చివరికి అక్కడికి వెళ్లిన తరువాత క‌రోనా తీవ్ర‌రూపం దాల్చింది. 
 
భారత దేశంతో పాటు పలు దేశాలు లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో.. విమానాలు వచ్చే పరిస్థితులు లేకపోవడంతో, వారంతా అక్కడే చిక్కుకుపోయారు. తిండి లేక నానా ఇబ్బంది పడుతున్నారట. తమను ఎలాగైనా భారత్‌కు తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని యూనిట్ సభ్యులు కోరుతున్నారు. 
 
జోర్డాన్‌లోని ఎడారి ప్రాంతంలోకి వెళ్లిన బ్లెస్సీ యూనిట్.. ఎటూ కదిలే దారి లేక, యూనిట్ మొత్తం ఆకలి బాధలు పడుతోందట. వారిని ఎలాగైనా వెనక్కు రప్పించాలని మాలీవుడ్ ప్రముఖులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు నటుడు పృథ్వీరాజ్ సోషల్ మీడియా ద్వారా స్పందించాడు. ఏప్రిల్ 2వ తేదీ వరకు ముందుగా ప్లాన్ చేసుకున్న రీతిలో వసతి, ఆహారం, సామాగ్రి వుందని.. కానీ ఆ తర్వాత ఏమౌతుందో ఏమోనని తెలిపాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ - పాక్‌తో సహా మొత్తం ఏడు యుద్ధాలు ఆపాను.. శాంతి బహుమతి ఇవ్వాలి : డోనాల్డ్ ట్రంప్

Jagan: తక్కువ దూరాలకే హెలికాఫ్టర్లు.. సీఎంగా వున్నప్పుడు జగన్ రూ.220 కోట్లు ఖర్చు

ఏపీ సీఎం చంద్రబాబుకు లీగల్ నోటీసులు పంపించిన సీఐ శంకరయ్య

ప్లీజ్... అంకుల్ అని పిలవకండి... బాలయ్య అని మాత్రమే పిలవాలి..

సొంత ప్రజలపై బాంబుల వర్షం కురిపించిన పాకిస్థాన్ సైన్యం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే ఏంటి ప్రయోజనాలు?

భారతీయ రోగులలో ఒక కీలక సమస్యగా రెసిస్టంట్ హైపర్‌టెన్షన్: హైదరాబాద్‌ వైద్య నిపుణులు

శనగలు తింటే శరీరానికి అందే పోషకాలు ఏమిటి?

కామెర్ల వ్యాధితో రోబో శంకర్ కన్నుమూత, ఈ వ్యాధికి కారణాలు, లక్షణాలేమిటి?

యాలకలు 6 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments