Webdunia - Bharat's app for daily news and videos

Install App

'రామసేతు'కు కరోనా దెబ్బ.. అక్షయ్‌తో పాటు 45 మందికి కోవిడ్ పాజిటివ్

Webdunia
సోమవారం, 5 ఏప్రియల్ 2021 (14:22 IST)
బాలీవుడ్‌ను కరోనా కుదిపేస్తోంది. అక్షయ్ కుమార్ కథానాయకుడిగా 'రామసేతు' సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. అయితే.. అది మొదలైన కొద్ది రోజులకే హీరో అక్షయ్ కుమార్‌కు కరోనా అని తేలింది. దాంతో ఆయన హోమ్ ఐసొలేషన్‌కు వెళ్లిపోయారు. నిజానికి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావడానికి ముందే ఇందులో పాల్గొనే వారికి కోవిడ్ 19 పరీక్షలు చేశామని చిత్ర నిర్మాతలు చెబుతున్నారు. 
 
అయినా కూడా షూటింగ్ మొదలైన తర్వాత 45 మంది జూనియర్ ఆర్టిస్టులకు కరోనా సోకినట్టు తెలిసిందట. దాంతో వీరందరికీ అక్షయ్ కుమార్ హోమ్ ప్రొడక్షన్ హౌస్ తో పాటు ఈ చిత్ర నిర్మాతలు తమ సొంత ఖర్చుతో చికిత్స చేయిస్తున్నారట. షూటింగ్ సమయంలో నటీనటులు, సాంకేతిక నిపుణులకు టెస్టులు చేయించడానికి వైద్య బృందాన్ని, తగినన్ని పీపీఇ కిట్స్‌ను అందుబాటులో ఉంచామని నిర్మాతలు చెబుతున్నారు. 
 
ఇందుకోసం లక్షల రూపాయలను ఖర్చు చేస్తున్నారట. అయితే... కరోనా కేసులు ఇలానే పెరిగితే మాత్రం రాబోయే రోజుల్లో సినిమా షూటింగ్ ను నిర్మాతలు రద్దు చేయాల్సిన పరిస్థితి రావచ్చు. ఇది 'రామసేతు'కు మాత్రమే పరిమితం అవుతుందనీ చెప్పలేం. మొత్తం బాలీవుడ్ లోనూ షూటింగ్స్ ఆగిపోయే ప్రమాదమూ ఉంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments