Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్ సినీ కార్మికులకు వేతనాలు పెంపు.. జూలై నుంచి అమలు

Webdunia
శుక్రవారం, 16 సెప్టెంబరు 2022 (08:22 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన సినీ నిర్మాణ కార్మికులకు వేతనాలు పెంచారు. ఈ పెంపు దాదాపు 30 శాతంగా ఉంది. ఈ పెంచిన వేతనాలు కూడా ఈ యేడాది జూలై నుంచే అందజేయనున్నారు. ఈ మేరకు ఫిల్మ్ చాంబర్, ఫిల్మ్ ఫెడరేషన్, నిర్మాతల మండలిలు సంయుక్తంగా ఓ ప్రకటన చేశాయి. 
 
వేతనాల పెంపునకు సంబంధించి బుధవారం కీలక చర్చలు జరిగాయి. అయితే, ఎంత మేరకు పెంపు, ఎప్పటి నుంచి అమలు వంటి కీలక అంశాలపై గురువారం కీలక నిర్ణయం వెలువడింది. ఈ మేరకు చిత్ర పరిశ్రమ నుంచి సంయుక్త ప్రకటన వెలువడింది. 
 
ఈ ప్రకటన మేరకు పెద్ద చిత్రాలకు పనిచేసే కార్మికులకు 30 శాతం మేరకు వేతనాలు పెంచనున్నారు. అదేసమయంలో చిన్న చిత్రాలకు పని చేసే కార్మికులకు మాత్రం 15 శాతం మేరకు వేతనాలు పెంచనున్నారు. అయితే, ఇది చిన్న చిత్రం, ఏది పెద్ద సినిమా అనే విషయాన్ని మాత్రం చలనచిత్ర వాణిజ్య మండలి, ఎంప్లాయీస్ ఫెడరేషన్‌లతో కూడిన ఒక కమిటి నిర్ణయిస్తుంది. 
 
ఇకపోతే, పెంచిన వేతనాలను కూడా ఈ యేడాది జూలై నుంచే అమలులు చేయనున్నట్టు ప్రకటించారు. ఫలితంగా కార్మికులకు అరియర్స్ కూడా అందనున్నాయి. ఈ కొత్త వేతన ఒప్పందం వచ్చే 2025 వరకు అమల్లోకి రానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గుడికి వచ్చిన యువతిపై సామూహిక అఘాయిత్యం.. ఎక్కడ?

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments